బియాస్ విషాదం: మరో ముగ్గురి మృతదేహాలు లభ్యం
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల్లో గురువారం ఉదయం రెండు మృత దేహాలు అభ్యమయ్యాయి. గురువారం మధ్యాహ్నం మరో విద్యార్థి మృత దేహం లభ్యమైంది. మాచర్ల అఖిల్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు 12 మృత దేహాలు లభ్యమయ్యాయి.
ఇంకా 12 మృత దేహాలు లభ్యం కావాల్సి ఉంది. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను అధికారులు హైదరాబాద్కు పంపనున్నారు. గురువారం ఉదయం ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. విద్యార్థులు శివప్రకాశ్ వర్మ, ఆశిష్ మంథాల మృతదేహాలుగా గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు తల్లిదండ్రులకు సమాచారమందించారు.

గురురవారం సాయంత్రానికి శివప్రకాశ్ మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించే అవకాశం ఉంది. కాగా, సికింద్రాబాద్ చిలకలగూడ శ్రీనివాసనగర్కు చెందిన ఆశీష్ మంథా ప్రమాద సమయంలో ఇద్దరు విద్యార్థినులను ఒడ్డుకు చేర్చి, అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడని అతని స్నేహితులు చెప్పారు.
ఏడాది క్రితం భర్తను కోల్పోయి విచారంలో ఉన్న ఆశీష్ తల్లి సత్యవాణి ఈ వార్త విని కన్నీంటిపర్యంతమైంది.
మొత్తం 24 మంది బియాస్ నదిలో గల్లంతవగా ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 12మంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications