కల్తీ మద్యం: కటక్, హైదరాబాదుల్లో మల్లాది విష్ణు కోసం గాలింపు, హాజరు కాని తల్లి
విజయవాడ: కాంగ్రెసు నాయకుడు మల్లాది విష్ణు మెడకు కల్తీ మద్యం ఉచ్చు బిగిసింది. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన అరెస్టుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగం సిద్ధం చేసింది. ఆయనను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
మల్లాది విష్ణు కోసం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో, ఒడిశా రాష్ట్రంలోని కటక్లో గాలింపు చర్యలు చేపట్టారు. మల్లాది విష్ణు సోదరుడు మల్లాది శ్రీనివాస్ అలియాస్ బుల్లయ్యను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడలోని స్వర్ణ బార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మరణించగా, 31 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మల్లాది విష్ణును శనివారం సాయంత్రానికి అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన శనివారంనాడు ఒడిశాలోని కటక్లో ఓ ఆలయాన్ని సందర్శించుకున్నట్లు చెబుతున్నారు.
మల్లాది విష్ణు సెల్ఫోన్ సిగ్నల్స్ను ట్రాప్ చేసేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా మల్లాది విష్ణు తల్లి బాలత్రిపుర సుందరమ్మ కోసం సిట్ అధికారులు మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూశారు. ఆమె పోలీసు స్టేషన్కు రాకపోవడంతో సిట్ అధికారులు వెనుదిరిగారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications