సెటైర్: పవన్ కళ్యాణ్పై కల్వకుంట్ల కవిత లెక్క!
హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థులపై రాజకీయ బాణాలు విసరడంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తండ్రి కెసిఆర్ నుంచి చాలానే నేర్చుకున్నట్లున్నారు. సర్వేలో పాల్గొనకపోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తమ పార్టీ మాజీ నేత విజయశాంతిలపై విసిరిన వాగ్బాణాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
వారిద్దరు వివరాలు ఇవ్వకపోవడం వల్ల సమగ్ర కుటుంబ సర్వే స్థాయి ఏమీ తగ్గలేదని ఆమె అన్నారు. సర్వేను తెలంగాణ ప్రజలు విజయవంతం చేశారని ఆమె అన్నారు. సర్వేలో పాల్గొననివారు మనుషుల కిందికి లెక్కకు వస్తారా అని అమె అన్నారు. పవన్ కళ్యాణ్, విజయశాంతిలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్య చేశారు.

ఆంధ్రప్రదేశ్ లేదా సీమాంధ్ర ప్రజలను వేరు చేయడానికి ఇంత భారీ సర్వే చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ సర్వేలో పాల్గొనకపోవడంపై కెసిఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. సర్వేలో పాల్గొనకపోవడం సామాజిక నేరమని అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ సామాజిక నేరస్థుడవుతాడా అంటూ మీడియాలో కథనాలు ప్రారంభమయ్యాయి.
కెసిఆర్ వ్యాఖ్యకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఇంట్లో లేకపోవడం వల్ల వివరాలు అందించలేదని అంటూనే రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత కూడా కెసిఆర్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరి కాదని అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications