Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీలో కెసిఆర్‌కు సగమే: సీమాంధ్రలో జగన్ హవా

Hung in Telengana, Jagan Reddy in Andhra Pradesh, says survey
హైదరాబాద్: సీమాంధ్రలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దెబ్బ తీస్తుందనే వాదనలో నిజం లేదని తాజా సర్వే తేల్చింది. సీమాంధ్రలోని శాసనసభ, లోకసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు తిరుగులేని సత్తా చాటుతుందని సర్వే తెలిపింది.

తెలంగాణలో కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏకపక్షంగా విజయం సాధించబోదని, ఒంటరి పోరు చేస్తే హంగ్ శాసనసభ తప్పదని సర్వేలో తేలింది. ఓ తెలుగు టీవి చానెల్ ఎసి నీల్సన్ సహకారంతో నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడించింది.

సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని, తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పోటీలో కూడా ఉండదని ఆ సర్వే తేల్చింది. ఈ సర్వే రెండు ప్రాంతాల్లోనూ 40 వేల మందిని ఎంపిక చేసుకుంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ కాస్తా మెరుగుపడిందని సర్వేలో తేలింది.

సర్వే ఫలితాల ప్రకారం - శానససభ ఎన్నికల్లో తెరాస 51 - 57 సీట్లతో అతి పెద్ద పార్టీగా తెలంగాణలో తెరాస అవతరిస్తుంది. తెలంగాణలో 119 శాసనసభ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీ 46 నుంచి 52 సీట్లు గెలుచుకుంటుంది. దాంతో తెలంగాణలో త్రిశంకు శాసనసభ ఏర్పడే అవకాశం ఉంది.

తెలంగాణలో టిడిపి 4-6 సీట్లు, బిజెపి 5-8 సీట్లు, మజ్లీస్ 7-8 సీట్లు, ఇతరులు 7-10 సీట్లు సాధించే అవకాశం ఉంది. పోలయ్యే ఓట్ల శాతం కాంగ్రెసుకు 30, తెరాసకు 34, టిడిపికి 13, బిజెపికి 10, వైయస్సార్ కాంగ్రెసుకు 3 ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+