అక్రమ సంబంధం పెట్టుకుందని పెళ్లి రోజే భార్యను చంపాడు
అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పెళ్లి రోజే ఆమెను హత్య చేశాడు.
గుంటూరు: మరో వ్యక్తితో అక్రమ సబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. మూడు నెలల గర్భిణీ అనే విషయం కూడా చూడకుండా చంపేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సౌపాడులోని బురదగుంటపాలెం కాలనీలో సోమవారం మధ్యా హ్నం జరిగింది.
గ్రామానికి చెందిన మౌనిక (26)కు ప్రకాశం జిల్లాకు చెందిన నూతనపాటి వెంకటేశ్వర్లుతో ఏడాది క్రితం వివాహం అయింది. మౌనికకు మూడో పెళ్లి కాగా వెంకటేశ్వర్లుకు రెండో పెళ్లి. ఏడాది క్రితం పెళ్లి అయిన తరువాత వెంకటేశ్వర్లు సౌపాడులోనే ఉంటూ కూలి పనులకు వెళుతున్నాడు.
భార్యపై అనుమానంతో భర్త వెంకటేశ్వర్లు ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు చెబున్నారు. అత్తమామలు పొలం పనులకు వెళ్లటంతో మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో భార్యతో అతడు గొడవ పడినట్లు తెలిసింది. దీంతో భార్యను వెంకటేశ్వర్లు హత్య చేసి పారిపోతూ నరసరావుపేట నుంచి మౌనిక పెదనాన్నకు ఫోన్లో చంపినట్లు చెప్పాడు.
దీంతో వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డీఎస్పీ శ్రీనివాసరావు, చేబ్రోలు సీఐ రవికుమార్, ఎస్సై అశోక్లు మృతదేహాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.