భర్తకు షాకిచ్చి ప్రియుడితో సహజీవనం ... రగిలిపోయిన భర్త ఏం చేశాడంటే ..
కట్టుకున్న మొగుడిని కాదని ఓ ఇల్లాలు ప్రియుడితో సహజీవనం చేయటం మొదలుపెట్టింది . ఆ విషయం తెలిసి రగిలిపోయిన భర్త ఊహించని ఘోరానికి ఒడిగట్టాడు. తన భార్య పై, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో విరుచుకుపడ్డాడు. విచక్షణ మరచి దారుణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాల్లోకి వెళితే
కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గోనెగండ్ల మండల కేంద్రంలో నాగరాజు అనే వ్యక్తి భార్య ఉరుకుందమ్మ గత కొంతకాలంగా బజారి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. భార్యను మార్చడానికి భర్త ఎంతగా ప్రయత్నించినా ఫలించలేదు. ఇక తనను కాదని వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న వారిద్దరిపై కోపం పెంచుకున్న నాగరాజు ఎలాగైనా వారిద్దరిని మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో భార్యపై, ఆమె ప్రియుడిపై కత్తి బండరాళ్లతో దాడి చేశాడు.

ఈ ఘటనలో భార్య ప్రియుడు బజారి మృతిచెందగా,భార్య ఉరుకుందమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెను కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇరువురిపై దాడి చేసి పారిపోయిన నాగరాజు కోసం కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications