చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విడివిడిగా దంపతులు: భార్యపై భర్త యాసిడ్ దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుపతి: చిత్తూరు జిల్లాలోని తిరుపతి రూరల్ మండలం కాలూర్ క్రాస్‌లో దారుణ సంఘటన జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పీలేరులోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న జరీనాబేగం తన భర్త ఖాజావలితో ఏర్పడిన మనస్పర్థల కారణంగా మూడేళ్లుగా విడిగా ఉంటోంది.

ఖాజావలి తరచూ భార్యను ఉద్యోగం మానేయాలని ఒత్తిడి చేసేవాడు. గతంలో ఈ విషయంలో గొడవ పడి కత్తితో దాడి చేసి జరీనాను గాయపరిచాడు. అతడిపై కేసు కూడా నమోదయింది. ఈ నేపథ్యంలోనే కాలూరు క్రాస్ రోడ్ మీదుగా ఇంటికి వెళ్తున్న జరీనాపై ఖాజావలి యాసిడితో ఆమెపై దాడి చేశాడు.

ఈ దాడిలో జరీనా తలకు, ముఖానికి గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జరీనా బేగం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Husband attacks with acid on his wife in Chittoor district

భార్య ఉద్యోగం మానేయకపోవడంతో ఖాజావలి కక్ష పెంచుకుని ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఆమె రెండు కళ్లకు ప్రమాదం ఉన్నట్లు సమాచారం.

వ్యక్తి దారుణ హత్య

ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని కొత్తపాలెం దగ్గర ఘోరమైన హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసి నోటికి ప్లాస్టర్ వేసి కాలువలో పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Husband Khajavali resorted acid attack on his wife Zareena Begum near Tirupathi in Chittoor district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X