కాకినాడ భూవివాదం: రిలయన్స్, ముఖేష్కు నోటీస్
హైదరాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్కు హైదరాబాద్ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం నోటీసులు ఇచ్చింది. భూవివాదమై ఓ మహిళ దాఖలు చేసిన వ్యాజ్యాంలో రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద రావు సోమవారం ఈ ఆదేశాలు జారీ చేశారు. తనకు చెందిన భూమిని నారాయణ రావు అనే వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించి, రిలయన్స్కు అప్పగించారని కాకినాడకు చెందిన దుర్గాంబ అనే మహిళ కాకినాడలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఆమె కంప్లైంట్లో నారాయణ రావు అనే వ్యక్తికి, రిలయన్స్ ఇండస్ట్రీస్కు, ముఖేష్ అంబానీలను కాకినాడ మెజిస్ట్రేట్ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications