గోపాల గోపాల చిత్రంపై హైకోర్టులో పిటిషన్, వారిని కలిపి మరొకటి...
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్ను వనక్కి తీసుకొని మరో పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్కు సూచించింది. దర్శక, నిర్మాతలనూ ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
కాగా, పవన్ కళ్యాణ్, వెంకటేష్లు నటించిన గోపాల గోపాల చిత్ర ప్రదర్శన పైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పది రోజుల వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. చిత్ర ప్రదర్శన ధ్రవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ హైదరాబాదుకు చెందిన రఘునాథ రావు హైకోర్టులో కేసు వేశారు.
పవన్, వెంకటేష్లు నటించిన గోపాల గోపాల చిత్రం పైన న్యాయవాదులు అంతకుముందు తెలంగాణ రాష్ట్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. పదహారు రోజుల క్రితం పలువురు న్యాయవాదులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో తమను కించపరిచే సన్నివేశాలున్నాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.