పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు,చిరంజీవి అందుకే దెబ్బతిన్నారు: చింతా మోహన్ సంచలనం
విజయనగరం: పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ చెప్పారు. జనసేన పార్టీకి ఎన్నికల చిహ్నం లేదని ఆయన చెప్పారు. జనసేన చీఫ్ 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. అయితే ఈ సమయంలో మరో మాజీ ఎంపీ చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
రాజకీయాల్లో పెను మార్పులు, ఆయనొస్తున్నాడు: చింతా మోహన్ సంచలనం
2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ మేరకు రాజకీయపార్టీల మధ్య పోత్తుల్లో కూడ మార్పులు , చేర్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పవన్ కంటే ముద్రగడకే ఫాలోయింగ్, వైఎస్ఆర్ కోసం రాజీవ్ను ఒప్పించా: వి.హెచ్.సంచలనం
2014 ఎన్నికల సమయంలో జనసేనను పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో టిడిపి, బిజెపి కూటమికి పవన్ కళష్యాణ్ మద్దతు పలికారు. కానీ, వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొంటారా అనే విషయమై ఇంకా తేలాల్సి ఉంది.తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ విజయనగరంలో శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ నేతలు అవమానించారు, వైఎస్తో విభేదాలు: డి.శ్రీనివాస్
పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు
పవన్
కళ్యాణ్
ఎవరో
తనకు
తెలియదని
తిరుపతి
మాజీ
ఎంపీ
చింతా
మోహన్
చేసిన
వ్యాఖ్యలు
సంచలనం
సృష్టిస్తున్నాయి.
జనసేన
పార్టీకి
ఎన్నికల
గుర్తు
కూడ
లేదని
చింతామోహన్
అభిప్రాయపడ్డారు.
గతంలో
కూడ
పవన్
కళ్యాణ్
ఎవరో
తనకు
తెలియదని
కొందరు
టిడిపి
ఎంపీలు
వ్యాఖ్యానించారు.కానీ,
తాజాగా
పవన్
కళ్యాణ్
గురించి
తిరుపతి
మాజీ
ఎంపీ
చింతా
మోహన్
చేసిన
వ్యాఖ్యలపై
జనసేన
పార్టీ
నేతలు
ఎలా
స్పందిస్తారో
చూడాలి.
పోలవరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ చేయాలి
పోలవరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ చేయించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు అవినీతిమయంగా మారిందని చింతా మోహన్ చెప్పారు.ఈ ప్రాజెక్టు ఏపీ రాష్ట్రానికి వరప్రదాయిని లాంటిదన్నారు. అయితే ఈ ప్రాజెక్టులో అవినీతిపై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
1993లోనే చిరంజీవిని రాజకీయాల్లోకి రావాలని కోరా
1993లోనే
చిరంజీవి
రాజకీయాల్లోకి
వచ్చి
ఉంటే
సక్సెస్
అయ్యేవారని
గతంలో
చింతా
మోహన్
వ్యాఖ్యానించారు.
అప్పుడే
రాజకీయాల్లోకి
చిరంజీవిని
రమ్మని
తాను
కోరినట్లు
వెల్లడించారు.
కానీ,
2009
ఎన్నికల
సమయంలో
చిరంజీవి
రాజకీయాల్లోకి
వచ్చినా
ప్రయోజనం
లేకపోయిందని
చింతా
మోహన్
అభిప్రాయపడ్డారు.
దళితులు, కాపులు రాజ్యాధికారం సాధించాలి
కాపులు, దళితులు ఏకమై రాజ్యాధికారాన్ని సాధించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.శ్రీకాకుళం, గోదావరి జిల్లాల నుండి రానున్న కాలంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.జన్మభూమి కార్యక్రమం పేదోడికి భరోసా ఇవ్వలేకపోయిందని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని విమర్శించారు.