వైఎస్ఆర్కు వ్యతిరేకంగా పనిచేశా, సీఎం కొడుకైతే ముఖ్యమంత్రి కావాలా: మైసూరా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కొడుకైతే ముఖ్యమంత్రి కావాలనుకోవడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అవుతోందా అని మాజీ మంత్రి ఎంవీ మైసురారెడ్డి చెప్పారు.రాజకీయాల నుండి ఇంకా రిటైర్ కాలేనది మైసూరారెడ్డి చెప్పారు.
బాబును చూస్తే భయం, అందుకే కక్షకట్టారు, సోము వీర్రాజెవరు?: జెసి సంచలనం
సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న మైసూరారెడ్డి తన రాజకీయ జీవితం గురించి భవిష్యత్ గురించి పలు విషయాలను చెప్పారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను చెప్పారు.
' వాస్తవాలు టిడిపి నేతలు తట్టుకోవడం లేదు,వారికి ఎందుకు మంత్రిపదవులిచ్చారు'
తనకు అసంతృప్తి లేదని చెప్పారు. తన రాజకీయ జీవితంలో సుదీర్ఘకాలం విపక్షంలోనే ఉన్నాడని మైసూరారెడ్డి చెప్పారు. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే విషయమై తాను ఆరు మాసాల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.
అవినీతికి వారసులు, రాష్ట్రంలో రూలింగ్ లేదు: బాబుపై సోము వీర్రాజు ఫైర్
తండ్రి ముఖ్యమంత్రే కొడుకు సీఎం కావాలా
నా తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, నేను కూడ ముఖ్యమంత్రిని కావాలనుకోవడం వంశపారంపర్యం అవుతోందని మాజీ మంత్రి మైసూరారెడ్డి చెప్పారు. కానీ, ప్రజాస్వామ్యంలో ఇది ఎలా చెల్లుబాటు అవుతోందని మైసూరారెడ్డి ప్రశ్నించారు.పుట్టుకతో వచ్చిన అలవాట్లు మారుతాయని తాను అనుకోవడం లేదని మైసూరారెడ్డి వైసీపీ చీఫ్ జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
1994వైఎస్ఆర్ నాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ చేశారు
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనిచేశారని మైసూరారెడ్డి గుర్తు చేసుకొన్నారు. దీనికి వ్యతిరేకంగా చెప్పారు. దీనికి వ్యతిరేకంగా 1996లో కూడ తాను కూడ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశానని మైసూరారెడ్డి చెప్పారు. అయితే ఇద్దరి మధ్య రాజీ కుదిరిందన్నారు. 1998లో తాను వైఎస్ఆర్ కు సపోర్ట్ చేసిన మైసూరారెడ్డి చెప్పారు.
టిఫిన్ కోసం పిలిస్తే వెళ్ళాను
తాను టిడిపిలో ఉన్న కాలంలో వైసీపీ నేతలు టిఫిన్కు ఆహ్వనించారని చెప్పారు. కానీ, వైసీపీలో చేరాలని వెళ్ళలేదని మైసూరారెడ్డిచెప్పారు. కానీ తాను ఆనాడు జగన్ ను కలవగానే పార్టీ నుండి సస్పెండ్ చేశారని చెప్పారు. బ్రేక్ఫాస్ట్ పిలిచారు, ఎందుకు వెళ్ళారో టిడిపి వివరణ అడిగే హక్కు ఉందన్నారు. కానీ ఆ ఘటనను తాను ఓ ఉచ్చులో ఇరుకొన్నట్టుగా మైసూరారెడ్డి చెప్పారు.
ఆ ఇద్దరు నాకు మద్దతిచ్చారు.
చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తనకు మంత్రి పదవిని ఇవ్వాలని భావించినా కొన్ని కారణాలతో మంత్రి పదవి దక్కలేదన్నారు. కానీ, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనకు మద్దతిచ్చారని మైసూరారెడ్డి చెప్పారు.
ఎంపీగా పోటీ చేస్తానని చెప్పా
2004లో ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలిసి కూడ పార్లమెంట్ కు పోటీ చేస్తానని తాను వైఎస్ఆర్ ముందు ప్రతిపాదించానని కానీ, తాను అందుకు అంగీకరించలేదని చెప్పారు.దీంతో ఆనాడు టిడిపిలో చేరినట్టు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు.టిడిపిలో చేరిన తర్వాత ఎంపీగా పనిచేసిన విషయాన్ని చెప్పారు.