వైఎస్ఆర్కు వ్యతిరేకంగా పనిచేశా, సీఎం కొడుకైతే ముఖ్యమంత్రి కావాలా: మైసూరా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కొడుకైతే ముఖ్యమంత్రి కావాలనుకోవడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అవుతోందా అని మాజీ మంత్రి ఎంవీ మైసురారెడ్డి చెప్పారు.రాజకీయాల నుండి ఇంకా రిటైర్ కాలేనది మైసూరారెడ్డి చెప్పారు.
సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న మైసూరారెడ్డి తన రాజకీయ జీవితం గురించి భవిష్యత్ గురించి పలు విషయాలను చెప్పారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను చెప్పారు.
తనకు అసంతృప్తి లేదని చెప్పారు. తన రాజకీయ జీవితంలో సుదీర్ఘకాలం విపక్షంలోనే ఉన్నాడని మైసూరారెడ్డి చెప్పారు. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే విషయమై తాను ఆరు మాసాల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.

తండ్రి ముఖ్యమంత్రే కొడుకు సీఎం కావాలా
నా తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, నేను కూడ ముఖ్యమంత్రిని కావాలనుకోవడం వంశపారంపర్యం అవుతోందని మాజీ మంత్రి మైసూరారెడ్డి చెప్పారు. కానీ, ప్రజాస్వామ్యంలో ఇది ఎలా చెల్లుబాటు అవుతోందని మైసూరారెడ్డి ప్రశ్నించారు.పుట్టుకతో వచ్చిన అలవాట్లు మారుతాయని తాను అనుకోవడం లేదని మైసూరారెడ్డి వైసీపీ చీఫ్ జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

1994వైఎస్ఆర్ నాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ చేశారు
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనిచేశారని మైసూరారెడ్డి గుర్తు చేసుకొన్నారు. దీనికి వ్యతిరేకంగా చెప్పారు. దీనికి వ్యతిరేకంగా 1996లో కూడ తాను కూడ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశానని మైసూరారెడ్డి చెప్పారు. అయితే ఇద్దరి మధ్య రాజీ కుదిరిందన్నారు. 1998లో తాను వైఎస్ఆర్ కు సపోర్ట్ చేసిన మైసూరారెడ్డి చెప్పారు.

టిఫిన్ కోసం పిలిస్తే వెళ్ళాను
తాను టిడిపిలో ఉన్న కాలంలో వైసీపీ నేతలు టిఫిన్కు ఆహ్వనించారని చెప్పారు. కానీ, వైసీపీలో చేరాలని వెళ్ళలేదని మైసూరారెడ్డిచెప్పారు. కానీ తాను ఆనాడు జగన్ ను కలవగానే పార్టీ నుండి సస్పెండ్ చేశారని చెప్పారు. బ్రేక్ఫాస్ట్ పిలిచారు, ఎందుకు వెళ్ళారో టిడిపి వివరణ అడిగే హక్కు ఉందన్నారు. కానీ ఆ ఘటనను తాను ఓ ఉచ్చులో ఇరుకొన్నట్టుగా మైసూరారెడ్డి చెప్పారు.

ఆ ఇద్దరు నాకు మద్దతిచ్చారు.
చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తనకు మంత్రి పదవిని ఇవ్వాలని భావించినా కొన్ని కారణాలతో మంత్రి పదవి దక్కలేదన్నారు. కానీ, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనకు మద్దతిచ్చారని మైసూరారెడ్డి చెప్పారు.

ఎంపీగా పోటీ చేస్తానని చెప్పా
2004లో ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలిసి కూడ పార్లమెంట్ కు పోటీ చేస్తానని తాను వైఎస్ఆర్ ముందు ప్రతిపాదించానని కానీ, తాను అందుకు అంగీకరించలేదని చెప్పారు.దీంతో ఆనాడు టిడిపిలో చేరినట్టు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు.టిడిపిలో చేరిన తర్వాత ఎంపీగా పనిచేసిన విషయాన్ని చెప్పారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications