ఏపీ ఐఏఎస్ అధికారిణి పల్లవి: కర్నాటక నాయకులకు హడల్
బెంగళూరు: నిజాయితీ గల తెలుగు మహిళా ఐఏఎస్ అధికారిణి కర్నాటకలో అవినీతిపరులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ కారణంగా ఆమె పలుమార్లు ట్రాన్సుఫర్ అయ్యారు. 2009 బ్యాచ్కు చెందిన ఆమె కర్ణాటక కేడర్ అధికారిణి. ఆరేళ్లలో తొమ్మిదిసార్లు ట్రాన్సుఫర్ అయ్యారు.
ఆమె ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఆకురాతి పల్లవి. ఈమె వయస్సు 33. అవినీతిపరులకు ఆమె అంటే హడల్. ఆమె ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఓ ఘటన జరిగింది. ఆమె బోర్డు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆమె వాట్సాప్కు ఓ సందేశం వచ్చింది.
అందులో ఆ రోజు జరగాల్సిన కెమిస్ట్రీ పేపర్ ఉంది. ఇంటర్ పరీక్షలు రాయాల్సిన ఓ కుర్రాడు దానిని పంపించాడు. దానిని చూసిన ఆమె వెంటనే పరీక్ష రద్దు చేశారు. మళ్లీ నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. అది కూడా లీక్ కావడం గమనార్హం. దానినీ రద్దు చేశారు.
దీంతో, ఆమెకు బెదిరింపులు వచ్చాయి. అయినా పల్లవి తగ్గలేదు. కేసు నమోదు చేసి, విచారణ సిఐడికి అప్పగించారు. పల్లవి కారణంగా ఎగ్జామ్ మాఫియా గుట్టు రట్టయింది. ఆమె ఎండోమెంట్ కమిషనర్గా కూడా పని చేశారు. వందల విలువైన దేవాలయ ఆస్తులను కాపాడారు.
కాగా, ఆకురాతి పల్లవి గుంటూరుకు చెందిన వ్యక్తి. ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్నారు. కర్నాటకలో ఉద్యోగం. ఆమె బెంగళూరులో నివసిస్తున్నారు. పల్లవి సివిల్స్లో 101వ ర్యాంకు సాధించారు. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం కావడంతో, ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఆమె కూచిపూడి డ్యాన్సర్. శ్లోకాలు పాడుతారు. ఇంకా వివిధ రకాల విద్యలు ఆమెకు తెలుసు.