ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ అలర్ట్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్, కుమావోన్ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

మహారాష్ట్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు

వాతావరణ శాఖ ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని కుమౌన్, యు గర్వాల్ ప్రాంతంలోని పరిసర జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో బుధవారం (సెప్టెంబర్ 14) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లోని కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబై, నగరంలోని సియోన్ ప్రాంతంలో వరద సమస్యలను ఎదుర్కొంటోంది. మరోవైపు, ముంబై, థానే, సింధుదుర్గ్‌లకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ఐదు రోజులపాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ వాతావరణ బులెటిన్ ప్రకారం.. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, సిక్కిం, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవాలలో రాబోయే కొద్ది రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. '14న గంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా చాలా విస్తృతంగా/ తేలికపాటి/మితమైన వర్షపాతం, ఉరుములు/మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది.

14, 15న బీహార్; సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం 15, 16న; 14వ-15వ తేదీల్లో సౌరాష్ట్ర, కచ్; 13-16 మధ్య పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతం, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని ఘాట్ ప్రాంతాలు రాబోయే ఐదుల్లో భారీ వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు

బుధవారం (సెప్టెంబర్ 14) కోస్తా ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడులోని ఘాట్ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో సహా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల సహా పలు ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా వరదనీటిలోనే ఉన్నాయి. ఈ వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు రణస్థలం ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈశాన్య, ఉత్తారాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు

హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో కూడా రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని ఎంజీఎం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని బర్న్ కేర్ యూనిట్‌లో భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోయింది. నాగాలాండ్‌లో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డిమాపూర్‌లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను భద్రతా సిబ్బంది రక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+