యువజన దినోత్సవం: ఆకట్టుకున్న నృత్యాలు(పిక్చర్స్)
హైదరాబాద్: అంతర్జాతీయ యువజన దినోత్సవం(ఆగస్టు 12) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్ష్ నియంత్రణ సంస్థ, కళాశాల విద్యా కమిషనరేట్, ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగాలు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సంయుక్తంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసి కళ్యాణ మండపం మీదుగా బాగ్ లింగంపల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఏపి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్, డా. కిషోర్ ప్రారంభించిన ఈ ర్యాలీలో సుమారు 2వేల మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతీ యువకులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండి దేశాభ్యుదయానికి కృచేయాలని అన్నారు.
యువజన దినోత్సవం
అంతర్జాతీయ యువజన దినోత్సవం(ఆగస్టు 12) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్ష్ నియంత్రణ సంస్థ, కళాశాల విద్యా కమిషనరేట్, ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగాలు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సంయుక్తంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసి కళ్యాణ మండపం మీదుగా బాగ్ లింగంపల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
యువజన దినోత్సవం
ఏపి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్, డా. కిషోర్ ప్రారంభించిన ఈ ర్యాలీలో సుమారు 2వేల మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
యువజన దినోత్సవం
యువతీ యువకులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండి దేశాభ్యుదయానికి కృచేయాలని అన్నారు.
యువజన దినోత్సవం
కార్యక్రమంలో డప్పు నృత్యం, స్వచ్ఛంద రక్తదానంపై నృత్య నాటకం, భారత నాట్యం ప్రేక్షకులను అలరింపజేశాయి.
యువజన దినోత్సవం
డిడి కళాశాల విద్యా కమిషనరేట్ డాక్టర్ శ్రీలత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఉస్మానియా యూనివర్సిటీ డా. రెడ్యా నాయక్, డిడి యువజన సర్వీసులు ఉషా, ఖమ్మం ఆర్ఆర్సి కో-ఆర్డినేటర్ శ్రీనివాసులు, విశాఖపట్నం ఆర్ఆర్సి కో-ఆర్డినేటర్ శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రం అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ కనకాచారి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
యువజన దినోత్సవం
యువత హింస, మాదక ద్రవ్యాల బారిన పడుట, విలాసాలు, లైంగిక అత్యాచారాలు లాంటి వాటికి దూరంగా ఉండాలని, మానసిక రుగ్మతలకు లోనుకాకుండా మంచి మార్గంలో నడవాలని వారు ఉపదేశించారు.
డిడి కళాశాల విద్యా కమిషనరేట్ డాక్టర్ శ్రీలత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఉస్మానియా యూనివర్సిటీ డా. రెడ్యా నాయక్, డిడి యువజన సర్వీసులు ఉషా, ఖమ్మం ఆర్ఆర్సి కో-ఆర్డినేటర్ శ్రీనివాసులు, విశాఖపట్నం ఆర్ఆర్సి కో-ఆర్డినేటర్ శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రం అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ కనకాచారి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
యువత హింస, మాదక ద్రవ్యాల బారిన పడుట, విలాసాలు, లైంగిక అత్యాచారాలు లాంటి వాటికి దూరంగా ఉండాలని, మానసిక రుగ్మతలకు లోనుకాకుండా మంచి మార్గంలో నడవాలని వారు ఉపదేశించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 65 మంది విద్యార్థినీ, విద్యార్థులు రక్తదానం చేశారు. ప్రతీ యువతి యువకుడు కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా రక్తదానం చేయాలని అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జయచంద్రా రెడ్డి కోరారు. కార్యక్రమంలో డప్పు నృత్యం, స్వచ్ఛంద రక్తదానంపై నృత్య నాటకం, భారత నాట్యం ప్రేక్షకులను అలరింపజేశాయి.