చెల్లని చెక్కు కేసు: మాజీ మంత్రి కుమారుడికి రెండేళ్ల జైలు, 20లక్షల జరిమానా
హైదరాబాద్: చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. తన వద్ద తీసుకున్న అప్పు తీర్చేందుకు కృష్ణారెడ్డి చెల్లని చెక్కు ఇచ్చారని విజయలక్ష్మి అనే మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన హైదరాబాద్లోని ఎర్రమంజిల్ న్యాయస్థానం కృష్ణారెడ్డికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20లక్షల భారీ జరిమానా విధించింది.

రూ.50 లక్షల ఎర్ర చందనం స్వాధీనం
నెల్లూరు: జిల్లాలోని సీతారాంపురం మండలం దేవమ్మచెరువు ఫారెస్టు ఏరియాలో శుక్రవారం ఉదయం అటవీ శాఖ అధికారులు విస్తృతంగా దాడులుచేసి 50 లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి నిందితులు పరారయ్యారు.
ఆటోను ఢీ కొట్టిన బస్సు: 27 మందికి గాయాలు
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని మడకశిర రైల్వేగేటు వద్ద ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు గొయ్యిలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 27 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications