సీఎం జగన్కు బాబు రాసిన మొదటి లేఖపై విజయసాయి సెటైర్లు.. ప్రజా సమస్యలపై కాదా...
విజయసాయి రెడ్డి చంద్రబాబు అంటేనే అగ్గి మీద గుగ్గిలం అయ్యే నేత .. వైసీపీ ఎంపీగా , జగన్ కు సన్నిహితుడిగా పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ఎన్నికల సమయంలో ట్విట్టర్ వేదికగా తిట్టిపోశారు . ఏపీలో అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబును బాగా గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు . అందులో భాగంగా తాజాగా చంద్రబాబు ఏపీ సీఎం జగన్ కు ప్రజా వేదిక గురించి రాసిన లేఖపైన పై మరోమారు ట్వీట్లతో దాడి చేశారు.

చంద్రబాబును ఎద్దేవా చేసిన విజయసాయి .. చంద్రబాబు లేఖపై కౌంటర్
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్లలో చంద్రబాబును ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు లేఖపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఎం జగన్కు చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందని భావించామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుడికి ప్రజా సమస్యలు పట్టవని , అమరావతిలోని విలాస భవనంపై చంద్రబాబుకు చింత పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తానని అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేదా అంటూ చంద్రబాబుకు విజయసాయి రెడ్డి చురకలు అంటించారు.

జగన్ పై ప్రసంశల వెల్లువ .. అవినీతికి ఆస్కారం లేని పాలన అందిస్తారని కితాబు
మరోవైపు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల రాసిన టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు సాహసోపేత నిర్ణయమంటూ కొనియాడారు. కొన్ని సందర్భాల్లో విశ్రాంత న్యాయమూర్తులతో విచారణ చేయించడం చూశామని, ఇప్పుడు నిరంతరం స్క్రూటినీ ఉంటుందన్నారు. ఇది జగన్ గారి పాలనకు నిదర్శనం అని విజయసాయి కొనియాడారు. అంతే కాదు ఐపిఎస్ ను తాకట్టు పెట్టిన కొందరు అధికారులు పోలీసు శాఖను టీడీపీ అనుబంధ విభాగంగా మార్చారని ఇంకో ట్వీట్ లో పేర్కొన్నారు . ప్రజలకు జవాబుదారిగా ఉండే అత్యుత్తమ వ్యవస్థను సృష్టించే పనిలో జగన్ గారు మొదటి అడుగు వేశారు. అధికార పార్టీ వారిని ఒకలా, సాధారణ ప్రజలను మరోలా చూసే రోజులకు చెల్లు అంటూ పోలీస్ శాఖపై మరో సంచలన ట్వీట్ చేశారు.

పీఠాధిపతులు ఎలా వ్యవహరించాలో కూడా మీరే నిర్ణయిస్తారా అని మండిపాటు
ఇకపోతే వైయస్ జగన్ శారదా పీఠాన్ని సందర్శించడంపై యెల్లో చానల్ ఒకటి చర్చపెట్టిందని చెప్పుకొచ్చారు. కుల మీడియా పెద్దాయన ఒకరు మాట్లాడుతూ స్వాములు ఎవరిని ముట్టుకోరు ఆలింగనం ఎలా చేసుకుంటారని, ముద్దులు పెడతారా అని తన అజ్ణానాన్ని, ఏడుపును ప్రదర్శించారుని ధ్వజమెత్తారు. పీఠాధిపతులు ఎలా వ్యవహరించాలో కూడా వీరే నిర్ణయిస్తారా అంటూ మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి.
ఐపి ఎస్ ను తాకట్టు పెట్టిన కొందరు అధికారులు పోలీసు శాఖను తెదేపా అనుబంధ విభాగంగా మార్చారు. ప్రజలకు జవాబుదారిగా ఉండే అత్యుమ వ్యవస్థను సృష్టించే పనిలో జగన్ గారు మొదటి అడుగు వేశారు. అధికార పార్టీ వారిని ఒకలా, సాధారణ ప్రజలను మరోలా చూసే రోజులకు చెల్లు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 6, 2019
జగన్ గారు శారదా పీఠాన్ని సందర్శించడంపై పచ్చ చానల్ ఒకటి చర్చపెట్టింది. కుల మీడియా పెద్దాయన ఒకరు మాట్లాడుతూ స్వాములు ఎవరిని ముట్టుకోరు ఆలింగనం ఎలా చేసుకుంటారని తన అజ్ణానాన్ని, ఏడుపును ప్రదర్శించారు. పీఠాదిపతులు ఎలా వ్యవహరించాలో కూడా వీరే నిర్ణయిస్తారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 6, 2019
సిఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా, పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 6, 2019












Click it and Unblock the Notifications