సిబిఐకి డిగ్గి యజమానా?: బాబు, టి నోట్పై స్పందన
రాజకీయాలకు అతీతంగా సిబిఐ పని చేయాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిది తమ డిఎన్ఏ అని డిగ్గీ అంటారు, పొత్తు ఉండవచ్చునని వీరప్ప మొయిలీ చెబుతారని.. వారి వ్యాఖ్యలతోనే జగన్ - కాంగ్రెసు పార్టీల మధ్య ఒప్పందం అర్థమవుతోందన్నారు. కాంగ్రెసు పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారని, పరువు తీశారని మండిపడ్డారు.
దొంగలు, అవినీతిపరులకు సిబిఐ అండగా నిలుస్తోందన్నారు. ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు కాంగ్రెసు సిబిఐని పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. జగన్కు బెయిల్ వచ్చే సమయంలో మెమో దాఖలు చేయడమేమిటన్నారు. గతంలో వేసిన ఛార్జీషీట్లు, తాజా మెమో పరస్పరం విరుద్దమని చెప్పారు.
తెలంగాణపై...
ఆంటోని కమిటీ రాష్ట్రానికి వచ్చి సమస్యలు వింటుందని ఒకరు చెబుతారు, రాదని మరొకరు చెబుతారని ఇదేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల ఐక్యకార్యాచరణ సమితి నేతలను కూర్చుండబెట్టి సమస్యను పరిష్కరించాలని తాము సూచించామన్నారు. తెలంగాణ నోట్ పై స్పందించేందుకు నిరాకరించారు. తాను ఊహాజనిత వార్తలకు స్పందించనన్నారు.