అది దేవస్థానమా స్మశాన వాటికనా తిరుమలలో సీపీఐ నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు
తిరుమలకు వెళ్లిన సిపిఐ నారాయణ తిరుమలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమలలోని శ్రీవారి దర్శనం తాను ఇంకా చేసుకోలేదని పేర్కొన్న సిపిఐ నారాయణ తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి టిటిడి ట్రస్ట్ ఉందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు చేస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో కర్ణాటకలోని ధర్మస్థళ ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందని వ్యాఖ్యలు చేశారు.
500 మందిపై లైంగిక దాడి చేసి హత్య చేసి పూడ్చి పెట్టారు
ధర్మస్థల ట్రస్ట్ కు ఏడాదికి వంద కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని పేర్కొన్న నారాయణ ధర్మస్థళ దేవస్థానంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అన్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేసి దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. ధర్మస్థళ ట్రస్ట్ ను వెంటనే ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్న నారాయణ 500 మందిపై లైంగిక దాడి చేసి హత్య చేసి పూడ్చి పెట్టారన్నారు.

అది దేవస్థానమా స్మశాన వాటికనా?
అది దేవస్థానమా లేక స్మశాన వాటికనా అని ప్రశ్నించారు. ట్రస్ట్ చైర్మన్ ను, సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. తవ్వేకొద్దీ పుర్రెలు, ఎముకలు బయట పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో సిపిఐ నేత ఎంపీగా చేయకూడదని ట్రస్టు సభ్యులు అడ్డుకున్నారని, అతను తెగించి పోటీ చేసినందుకు 15 ఏళ్ల ఆయన కుమార్తెను అత్యాచారం చేసి చంపేశారని సిపిఐ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల స్వామి సాక్షిగా సీపీఐ నారాయణ డిమాండ్
ఇలాంటి ఘటనలు ట్రస్ట్ ల యొక్క పవిత్రతను ప్రశ్నిస్తాయన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ ట్రస్టు చైర్మన్ తో పాటు సభ్యులందరినీ అరెస్టు చేయాలని, ట్రస్ట్ ను ఎండోమెంట్ కి హ్యాండోవర్ చేయాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు.ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కర్ణాటకలోని ధర్మస్థళ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది .
ధర్మస్థళలో తవ్వకాలు.. దర్యాప్తు సాగుతుందిలా
ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం మరో ప్రదేశంలో తవ్వకాలను చేపట్టగా, ఇప్పటివరకు ఆ స్థలంలో ఏమి లభించాయి అన్నది వెల్లడించలేదు. ఈ తవ్వకాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఇక అన్ని ఆధారాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదికలు, చట్టపరమైన ప్రక్రియల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సిట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో జరుగుతున్న దర్యాప్తు కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ వర్గాలలోను, ప్రజలలోను సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications