తెర పైకి 'బ్రహ్మానందరెడ్డి': నంద్యాల బరిలో? భూమా చిన్న కుమార్తె కూడా!?
ప్రస్తుతం ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి చెందిన జగత్ డెయిరీ వ్యవహారాలను బ్రహ్మానందరెడ్డి చూసుకుంటున్నారు.
నంద్యాల: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఏర్పడిన నంద్యాల ఉపఎన్నిక ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైసీపీ కూడా బరిలో దిగుతామని ప్రకటించడంతో బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో తొలుత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె పేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెర పైకి రాగా.. తాజాగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరు తెర పైకి రావడం గమనార్హం. నిజానికి శోభా నాగిరెడ్డి చనిపోయిన సమయంలోను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసేందుకు బ్రహ్మానందరెడ్డి ఆసక్తి కనబరిచారు. అయితే భూమా పెద్ద కుమార్తె అఖిలప్రియకు ఆ స్థానం కేటాయించడంతో బ్రహ్మానందరెడ్డి వ్యాపారాల్లోనే మునిగిపోయారు.

ప్రస్తుతం ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి చెందిన జగత్ డెయిరీ వ్యవహారాలను బ్రహ్మానందరెడ్డి చూసుకుంటున్నారు. భూమా మరణంతో ఖాళీ అయిన నంద్యాల స్థానంలో పోటీ చేసేందుకు బ్రహ్మానందరెడ్డి కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేత, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి బ్రహ్మానందరెడ్డి అల్లుడు కావడం విశేషం. బ్రహ్మానందరెడ్డి గనుక ఎన్నికల బరిలో నిలిస్తే.. కాటసాని వర్గం నుంచి కూడా ఆయనకు మద్దతు లభించే అవకాశముంది.
ఏదేమైనా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయం కాబట్టి.. బరిలో ఎవరిని నిలపాలనేది ఆయనే నిర్ణయించనున్నారు. సానుభూతి ప్రకారం చూసుకుంటే భూమా చిన్న కుమార్తెను బరిలో నిలిపే అవకాశం ఉన్నప్పటికీ.. తాజాగా బ్రహ్మానందరెడ్డి పేరు తెరపైకి రావడంతో చంద్రబాబు తుది నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications