త్వరలో శుక్రగ్రహంపై ఇస్రో పరిశోధనలు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో సంచలన అధ్యాయానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే చంద్రుడు, అంగారక మిషన్లను విజయవంతంగా పూర్తి చేసి తదుపరి శుక్రుడుపై ప్రయోగానికి సిద్ధంగా ఉంది. మంచి వాతావరణం కలిగి, నివాసయోగ్యమైన గ్రహాలు, నక్షత్రాలు, ఎక్సో ప్లానెట్ ల రహస్యాలు శోధించే దిశగా దృష్టి సారిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహమైన శుక్రుడిపై భారత్ మిషన్ చేపట్టిందని, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేయడానికి రెడీ అవుతున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

అంతరిక్ష వాతావరణం, భూమిపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి మరో రెండు ఉపగ్రహాలను సిద్ధం చేసే పనిలో ఉన్నామని తెలిపారు. శుక్ర గ్రహం ఆయన గ్రహం అని పేర్కొన్న ఆయన దాని వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువ అంటూ తెలిపారు. నాసా భవిష్యత్తులో మిషన్లు 2029, 2030, 2031లో చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అంగారక గ్రహంపై వ్యోమ నౌకను దింపే ప్రాజెక్టును కూడా రూపొందిస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. రాకెట్ డిజైన్, తయారీతో పాటు, వాటిలో ఉపయోగించే ముఖ్య విడి భాగాలైన ప్రాసెసర్, కంప్యూటర్ చిప్స్ వంటి వాటిని కూడా దేశీయంగా తయారు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
అంతరిక్ష పరిశోధనల కోసం అవసరమయ్యే సాంకేతికత, రాకెట్, ఉపగ్రహాల తయారీ, స్పేస్ అప్లికేషన్ వంటి వాటిని దేశంలోని వివిధ జాతీయ పరిశోధనా సంస్థలతో కలిసి ఇస్రో రూపొందిస్తుందని తెలిపారు. సీఎస్ఐఆర్ వంటి దేశీయ పరిశోధనా ల్యాబ్లో సహకారంతోనే తాము ఈ ఏ ఘనత సాధించగలిగాం అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. అంతేకాదు రాకెట్ లో ఉపయోగించే 95 విడి భాగాలను భారత్ నుండే సేకరించినట్టు పేర్కొన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications