ఆ విషయంలో రోజా ఫస్ట్, తర్వాత చంద్రబాబు కథ, అన్ని లెక్కలు సరిపోతే నగిరి ఫస్ట్ !
ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలు ఎలా ఉన్నా అందరి కళ్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలతో పాటు తెలంగాణ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు సమీపిస్తుండటంతో ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని పార్టీల నాయకులు, ప్రజలు టెన్షన్ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు నుంచి, రోజా నగిరి నుంచి పోటీ చెయ్యడంతో ఆ జిల్లా రాజకీయాల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా అందరి కళ్లు నగిరి మీద ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

చిత్తూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల సంఖ్య పరంగా చూస్తే చిత్తూరులో తక్కువగా పోలింగ్ కేంద్రాల సంఖ్య ఉంది. చిత్తూరులో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నగిరిలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండటంతో పోటీలో ఏడు మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. అన్ని లెక్కలు పరిశీలిస్తే మొదటి ఫలితం చిత్తూరుదా, లేక నగిరిదా అని అందరూ అంచనాలు వేసుకుంటున్నారు.
అన్ని అనుకూలిస్తే చిత్తూరు జిల్లాలో మొదటి ఫలితాలు వెలువడే నియోజక వర్గం నగిరి అని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని నిమిషాల వ్యవదిలోనే నగిరి, చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నగిరి అసెంబ్లీ నియోజక వర్గం ఫలితాలు మొదట వచ్చే అవకాశం ఉందని తెలిసింది. నగిరి, చిత్తూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురించి అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలైన ఈవీఎంల ఓట్ల లెక్కింపు 130 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో కౌంటింగ్ కు సుమారు 25 నిమిషాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని నియోజక వర్గాల ఎన్నికల ఫలితాలు వెలువడటానికి సాయంత్రం 4 గంటలు పడే అవకాశం ఉందనని అధికారులు అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు సదరు నియోజక వర్గం ఆర్వో ఎన్నిక పత్రం అందజేస్తారు. చిత్తూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చెయ్యడానికి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జూన్ 4వ తేదీ ఉదయం 5.30 గంటలకే సిబ్బందికి టేబుల్ కేటాయింపుల ప్రకియ చేపట్టడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications