ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు- ఈఆర్సీ నిర్ణయం-ఆగస్టు నుంచి అమలు-కొత్త ఛార్జీలివే
ఏపీలో వేసవి వేళ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీల మోత మోగింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల్ని పెంచుతూ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు 45 పైసల నుంచి రూపాయి 40 పైసల వరకూ పెరగబోతున్నాయి.
ఏపీలో తాజాగా పెరిగిన విద్యుత్ ఛార్జీల ప్రకారం చూస్తే 30 యూనిట్ల వరకూ యూనిట్ కు 45 పైసలు పెరిగింది. అలాగే
31-75 యూనిట్ల వరకూ యూనిట్ కు 91 పైసలు పెరిగింది. 76-125 యూనిట్ల వరకూ యూనిట్ కు 1.40పైసలు పెంపు వర్తింపచేయనున్నారు. 126-225 యూనిట్ల వరకూ రూ.1.57 పెరిగింది. అలాగే 226-400 యూనిట్ల వరకూ 1.16 పెరిగింది. 400 యూనిట్ల పైన ఉంటే మాత్రం యూనిట్ కు 55 పైసలు పెరిగింది. కొత్త ఛార్జీలపై ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జునరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో వేసవిలో వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలకు మంట పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు తప్పలేదని ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి తెలిపారు. ధరల పెంపు బాధాకరమే అన్నారు. ప్రస్తుతం ఉన్న కేటగిరీలను రద్దు చేసి స్లాబ్ ల విధానంలోకి మార్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఆరు స్లాబ్ లుగా విభించారు. ఆ స్లాబ్ ల ఆధారంగానే కొత్త ఛార్జీల్ని అమల్లోకి తెచ్చారు. వీటి ఆధారంగానే ఇకపై ఛార్జీలు వసూలు చేయాలని ఈఆర్సీ డిస్కమ్ లకు సూచించింది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications