వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ- విజయవాడకు కృష్ణా బోర్డు తరలింపు- 4 అంశాలకు కేసీఆర్‌, జగన్‌ ఒకే...

|
Google Oneindia TeluguNews

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు జల వివాదాల పరిష్కారం కోసం ఇవాళ కేంద్ర జల్‌శక్తి మంత్విత్వశాఖ నిర్వహించిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ విజయవంతమైనట్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రకటించారు. రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో మొత్తం నాలుగు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన ప్రకటించారు. ఇందులో కృష్ణా రివర్‌ బోర్డు కార్యాలయం తరలింపుతో పాటు ఇతర అంశాలున్నాయి.

jagan, kcr agreed to shift krishna river board office to vijayawada in apex council meet

ఏపీ విభజన పూర్తయి ఆరేళ్లు గడుస్తున్నా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై క్లారిటీ రాకపోవడంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇవాళ జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, ఇతర అధికారుల భేటీలో మాత్రం పలు అంశాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు షెకావత్‌ తెలిపారు. ఇందులో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కృష్ణా రివర్‌ బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని నిర్ణయించారు.

jagan, kcr agreed to shift krishna river board office to vijayawada in apex council meet

Recommended Video

Krishna Water Dispute B/W AP&TS తెలుగురాష్ట్రాల కృష్ణా జలాల పంచాయితీ .. తేల్చాల్సింది కేంద్రమే !!

కృష్ణా, గోదావరి నదులపై ఏ కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా దానికి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి ఉండాల్సిందేనని కేంద్రమంత్రి షెకావత్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించేందుకు కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్రం త్వరలోనే నిర్ణయిస్తుందని షెకావత్ వెల్లడించారు. విభజన చట్టం ప్రకారమే నిర్ణయాలు ఉంటాయన్నారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని, ఇందుకు సహకరించిన ఇద్దరు ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.

English summary
apex council meeting in delhi between andhra pradesh and telangana chief ministers has ended fruitfully. both the chief ministers have agreed to four points including shifting of krishna river board officer from hyderbad to vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X