ఓటమిపై జానా, కేసీఆర్ పైనా: రాజధానిపై హరిబాబు

Jana Reddy on defeat of Congress
హైదరాబాద్: తెలంగాణలో బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారని, కానీ నాయకత్వం లేకపోవడం వల్లనే ఓడిపోయాని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కుందూరు జానారెడ్డి గురువారం అన్నారు. తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీలు పార్టీ వీడడం సరికాదని అన్నారు. తెలంగాణలో పీసీసీ నియామకంపై అధిష్టానం జాప్యం కూడా పార్టీ ఓటమికి కారణమైందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నాయకత్వ లోపం ఉందని, దానిని పూరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

పాలమూరుకు ప్రాధాన్యత: కేటీఆర్

వెనుకబడిన పాలమూరుకు తాము అండగా ఉంటామని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. కేబినెట్ విస్తరణలో పాలమూరుకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కేటీఆర్ మహబూబ్ నగర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లాకు అనుబంధం ఉందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. జడ్చర్ల - మహబూబ్ నగర్ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తామన్నారు.

రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారం: హరిబాబు

నూతనంగా నిర్మాణం జరిగే రాజధాని అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు గుంటూరు జిల్లాలో అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజధాని అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలన్నారు. కేంద్రీకృత వ్యవస్థ పద్ధతిలో అభివృద్ధి మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

వివిధ ప్రభుత్వ కీలక శాఖలు ఆయా ప్రాంతాలలో నెలకొల్పి అక్కడ నుండే పని చేయాలన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అవసరమన్నారు. 25 పార్లమెంటు స్థానాలున్న ఎపిలో 25 జిల్లాలు ఉండేలా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. బీజేపీ చేస్తున్న ఈ ప్రతిపాదనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చసి కేంద్రం నుంచి అవసరమైన సాయం పొందాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+