సముద్రస్నానం చేసిన పవన్ కళ్యాణ్, నేడే పోరాట యాత్ర ప్రారంభం
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇఛ్ఛాపురం నుంచి ప్రారంభం కానుంది. కపాసుకుద్ది తీర ప్రాంతంలో గంగపూజ చేశారు. ఉదయం గం.11.30కు స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇచ్ఛాపురంలో నిరసన కవాతులో పాల్గొంటారు.
పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో కలిసి సముద్రస్నానం చేశారు. అనంతరం తీర ప్రాంతంలో గంగపూజ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయనను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపించారు.

కాగా, పవన్ తలపెట్టిన జన పోరాట యాత్ర ఈ రోజు ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి మొదలయ్యే ఈ యాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఆదివారం మధ్యాహ్నం సూరంగి రాజావారి మైదానంలో బహిరంగ సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.
More From
-
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..!












Click it and Unblock the Notifications