జనసేన పదవులకు కీలక నేత గుడ్ బై..! పవన్ కు లేఖ..!
జనసేన ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్న సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana)ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో అన్ని పదవుల నుంచీ తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు తనను అన్ని పదవుల నుంచీ తప్పించాలంటూ అధినేత పవన్ కళ్యాణ్ కు ఓ లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వాజ్యమే ఇందుకు కారణం.
గతంలో అమరావతి రాజధానిలో పర్యావరణ ఉల్లంఘనలపై బొలిశెట్టి సత్యనారాయణపై తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో బొలిశెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పర్యావరణ న్యాయం కోసం తన ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఇతర అనుబంధ పదవుల నుండి బయటకు వస్తున్నానని ఆయన ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ రాసిన లేఖను కూడా జత చేశారు.

ఆంధ్రప్రదేశ్లో కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఒక ప్రధాన పర్యావరణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL 248/2020)లో తాను పిటిషనర్గా ఉన్నానని, ఈ నేపథ్యంలో తాను "నైతిక విరామం" తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా, అధికార కూటమిలో కీలక నేతగా ఉన్న తన పాత్రల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా చూసుకోవడం అవసరమన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీయే (NDA) ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండటం, అలాగే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో పరస్పర ప్రయోజనాల సంఘర్షణను (Conflict of Interest) నివారణ కోసం, స్వచ్ఛమైన నీరు, గాలి కోసం జరుగుతున్న న్యాయ పోరాటం రాజకీయ కారణాల వల్ల ప్రభావితం కాకూడదని నిర్ధారించడం కోసం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు.

పర్యావరణ న్యాయం కోసం తన పర్యావర ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఇతర అనుబంధ పదవుల నుండి బయటకు వస్తున్నాను
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) February 3, 2026
ఎందుకు?
ఆంధ్రప్రదేశ్లో కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఒక ప్రధాన పర్యావరణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL 248/2020)లో నేను పిటిషనర్గా ఉన్నాను. ఈ నేపథ్యంలో నేను "నైతిక విరామం"… pic.twitter.com/Vsa5MtAOYf
ఇకపై పర్యావరణ పరిరక్షణపైనే తన దృష్టి అన్నారు. 'జల్ బిరాదరీ' నేషనల్ కన్వీనర్గా తన బాధ్యతలకు, "మన ముండి - మన నది" కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపారు. పార్టీ పదవి నుండి తాత్కాలిక విరామం మాత్రమే, రాజీనామా కాదన్నారు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, న్యాయపరమైన పరిష్కారం లభించిన తర్వాత అధిష్టానం కోరుకుంటే పార్టీ బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉందని తెలిపారు. జనసేన సిద్ధాంతాల పట్ల తన నిబద్ధత అచంచలమని, అయితే, పర్యావరణ న్యాయం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో, ప్రస్తుత అధికార యంత్రాంగం నుండి స్పష్టమైన దూరం పాటించడం తన నైతిక, ధర్మబద్ధమైన బాధ్యతని తెలిపారు. దీంతో బొలిశెట్టి వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications