ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇక అనవసరం: 'మోడీ మెజార్టీపై' జెసి సంచలనం
విజయవాడ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, అనంతపురం సీనియర్ రాజకీయ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి విజయవాడలో మరోసారి ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంతమంది ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంతమంది ప్రజాప్రతినిధిలకు టీఏలు, డిఏలు ఖర్చులు తప్ప మిగిలిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులను నేరుగా ఎన్నుకుంటే చాలన్నారు. ఇలాంటప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అవసరం లేదన్నారు.
కేంద్రంలో మెజార్టీ ఉండటంతో తమకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిని నేరుగా ఎన్నుకుంటే చాలన్నారు. ఇక ఎన్నికలు అనవసరమన్నారు. కాగా, కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది.

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ హవా కారణంగా బిజెపి 272 మార్జిన్ సీట్లను దాటింది. అయినప్పటికి మిత్రధర్మంలో భాగంగా మోడీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మిత్రపక్షాలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
అయితే, కేంద్రంలో బిజెపికి మార్జిన్ మెజారిటీ ఉండటం వల్ల తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆయన జెసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ముప్పై ఏళ్లలో ఏ పార్టీకి మార్జిన్ రాలేదు. పలు పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. దీంతో, చిన్న పార్టీలు కూడా ఆడిందే ఆట అయిన విషయం తెలిసిందే.
కాగా, జేసీ గతంలోను పలుమార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాను సంక్షేమ పథకాలకు వ్యతిరేకినని, కూలి పనికి వెళ్లేవారు రోజులో ఐదు సార్లు టీ తాగుతుంటారని, అలాంటి వారికి కిలో రూపాయి బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తనకు లక్ లేకనే మంత్రిని కాలేకపోయానని, చంద్రబాబుకు లక్ ఉండటంతోనే తిరిగి సీఎం అయ్యారన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications