శైలజానాథ్ ఇంటికి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత సాకే శైలజానాథ్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య దాదాపు గంటసేపు భేటీ జరిగింది. శైలజానాథ్ ఆహ్వానం మేరకే జేసీ ఆయనింటికి వెళ్లారని చెబుతున్నారు. కొంతకాలంగా శైలజానాథ్ టీడీపీలోకి వస్తారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. శింగనమల నియోజకవర్గం నుంచి సాకే 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు.
ప్రాథమిక విద్యాశాఖ, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2022లో జనవరి నుంచి నవంబరు వరకు ఏపీ పీసీసీ చీఫ్ గా పనిచేశారు. జేసీ దివాకర్ రెడ్డి, సాకే శైలజానాథ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం జేసీ సోదరులు టీడీపీలో చేరగా, సాకే మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అనంతపురం జిల్లాకే చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

తాను రాజకీయాల నుంచి తప్పుకుందామని భావించానని, కానీ తాజా పరిణామాలతో తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు రఘువీరా ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో రఘువీరా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మడకశిర నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో కల్యాణదుర్గం నియోజకవర్గానికి మారి గెలుపొందారు. వైఎస్ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా, ఆ తర్వాత కొణిజేటి రోశయ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోను మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. కొంతకాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications