ఓటుకు నోటు: మత్తయ్య చెప్పిన అసలు నిజాలు?.., తెర వెనుక ఇంత జరిగిందా?
Recommended Video

హైదరాబాద్: అప్పట్లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు.. ఆ తర్వాత మారుతూ వచ్చిన రాజకీయ సమీకరణాల రీత్యా తెరమరుగవుతూ వచ్చింది. రాజకీయాలు అసలు నిందితులను తప్పిస్తే.. మధ్యవర్తిగా ఉన్న తానే దోషిగా ఇరుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని నిందితుడు జెరూసలెం మత్తయ్య వాపోతున్నాడు.
ఈ మేరకు సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. పార్టీ ఇన్ పర్సన్ (న్యాయవాదితో సంబంధం లేకుండా)గా ఈ కేసులో హాజరయ్యేందుకు అనుమతి మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరడం గమనార్హం. కోర్టు నుంచి బయటకొచ్చిన అనంతరం మత్తయ్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో..:
హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు గంట గంటకు, రోజు రోజుకు వచ్చి అప్డేట్స్ ఇచ్చినవాళ్లు.. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే లేదు.
నాతో మాట్లాడిన ఏపీ టీడీపీ ప్రభుత్వం గానీ, తెలంగాణ పోలీసులు గానీ కేసు గురించి ఏ సమాచారమూ ఇవ్వట్లేదు. హైకోర్టులో కేసు క్వాష్ అయ్యేవరకు నాతో ఉన్నవాళ్లు ఈరోజు సుప్రీంకోర్టుకు వస్తే కనీసం వాయిదా డేట్ గురించి చెప్పడం లేదు.

బాబు, కేసీఆర్ ఏకమై?: మత్తయ్య అనుమానం
వారెంట్ జారీ అయితే నేను, నా కుటుంబ సభ్యులు జైలు పాలయ్యే కుట్ర చేస్తున్నారా? అన్న భయం వెంటాడుతోంది. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ఏకమై ఇదంతా చేయిస్తున్నారేమోనన్న ఆందోళన ఉంది. అందుకే పార్టీ ఇన్ పర్సన్గా నేను హాజరై జరిగిన వాస్తవాలన్నీ కోర్టు ముందు పెడుతా, ఆ ఇద్దరి ప్రతీకారాలకు నన్నెలా వాడుకున్నారో వివరిస్తా. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా.

వాయిదాకు రాకపోతే వారెంట్ ఇష్యూ చేస్తారని..:
ఓటుకు నోటు కేసులో రేవంత్ డబ్బులతో పట్టుబడ్డ నాటి నుంచి.. గత 2017 జూన్ వరకు వాళ్ల లాయర్లు నాతో టచ్ లో ఉన్నారు. కానీ గత ఆర్నెళ్ల నుంచి మళ్లీ ఎలాంటి సమాచారం లేదు. 23వ తేదీన వాయిదా ఉందని మీడియా ద్వారా తెలుసుకుని ఢిల్లీకి వచ్చా.
వాయిదాకు రాకపోతే వారెంట్ జారీ అయి ముద్దాయికి శిక్ష పడుతుందని వచ్చాను. కేసులో తటస్థంగా ఉన్నవారి సాక్ష్యం కావాలని చెప్పి నన్ను సాక్షిగా పెట్టారు. అందుకు నేను ఒప్పుకోలేదు. హైకోర్టు కూడా నాకు సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది.

అప్పట్లో కేటీఆర్ మనుషులు బెదిరించారు..:
కేటీఆర్ డ్రైవర్, గన్ మెన్ లు ఓసారి ఫోన్ చేసి బెదిరించారు. క్లాక్ టవర్ దగ్గరికి వచ్చి మాట్లాడాలని అన్నారు. పట్టుబడ్డవాళ్లపై కేసు ప్రూవ్ కావాలంటే.. తటస్థంగా ఉన్న నన్ను సాక్షిగా పెట్టాలని చూశారు. అయితే రేవంత్ పట్టుబడ్డ సమయంలో నేను లేను. డబ్బులు ఇచ్చినప్పుడు లేను. నేను లొంగకపోవడంతో నన్ను తిట్టారు.

ఏపీ పోలీసులు సైలెంట్ అయిపోమన్నారు..:
విజయవాడ వెళ్లాక కేటీఆర్ గన్మెన్, డ్రైవర్ ఫోన్ కాల్స్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఏపీ పోలీసులు వాళ్లకు నోటీసులు ఇచ్చి తెలంగాణ క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. కేవలం వారికి పనికొస్తుందన్న ఉద్దేశంతోనే కేసు పెట్టించుకున్నారు. మరి నన్ను వేధించారు కదా.. దానిపై కేసు పెట్టరా అని ఏపీ పోలీసులను అడిగితే సైలెంట్ అయిపోమని సలహా ఇచ్చారు.

అప్పు చేసి మరీ వచ్చా:
రాజకీయ ప్రయోజనాల రీత్యా టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు చేతులు కలిపాయి. కాబట్టి ఈ కేసులో అసలు నిందితులు పట్టుబడాలంటే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని చీఫ్ జస్టిస్ ను కోరినట్టు తెలిపారు. సీబీఐ దర్యాప్తు ద్వారానే అన్నీ వెలుగులోకి వస్తాయని అన్నారు. కేసుకు సంబంధించి అప్ డేట్స్ ఇచ్చేవారెవరూ లేకపోవడంతో అప్పు చేసి మరీ ఢిల్లీకి వచ్చాను.
-
కేసీఆర్ కు జీతం కట్ పై నిర్ణయం: సీఎం రేవంత్ -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్












Click it and Unblock the Notifications