జోగి బ్రదర్స్ కు బెయిల్ మంజూరు, ఇక నెక్స్ట్...!!
Jogi Ramesh:వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు బెయిల్ లభించింది. రమేష్ తో పాటుగా ఆయన సోదరుడుకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ వచ్చినా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ఆయన జైలులో ఉన్నారు. ఇప్పుడు, ఈ కేసులోనూ బెయిల్ రావటం తో జోగి బ్రదర్స్ ఇక నుంచి జైలు నుంచి విడుదలకు మార్గం సులభం అయింది. కోర్టు ఉత్తర్వులు జారీ కావటంతో.. అధికారిక ప్రక్రియ పూర్తయిన తరువాత జోగి బ్రదర్స్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఇక్కడే కొత్త చర్చ మొదలైంది.
మాజీ మంత్రి జోగి రమేష్.. ఆయన సోదరుడు కు బెయిల్ లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ తో పాటుగా ఆయన సోదరుడు పైన ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తనకు సంబంధం లేదంటూ జోగి రమేష్ విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రమాణం చేసారు. కాగా.. జనార్ధనరావు నుంచి సేకరించిన ఆధారాలతో జోగి బ్రదర్స్ ను అరెస్ట్ చేసారు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు ఎక్సైజ్ కోర్టులో బెయిల్ మంజూరు అయింది. 85 రోజులుగా ఈ కేసులో వారిద్దరూ జైలులో ఉన్నారు. ఈ రోజు బెయిల్ రావటంతో కొంత మేర ఊరట దక్కింది. కాగా.. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులోనూ జోగి రమేష్ నిందితుడుగా ఉండటంతో ఆయనకు ఇబ్రహీం పట్నం కేసులో బెయిల్ లభించినా.. జైలు నుంచి విడుదల కాలేదు. ఇక.. ఇప్పుడు మొలకల చెరువు మద్యం కేసులోనూ తంబళ్లపల్లి కోర్టులో బెయిల్ లభించింది.

సాయంత్రం విడుదల
అయితే, జోగి రమేస్ పైన చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల కేసు నుంచి చాలా ఉన్నాయి. వాటిలో ఏమైనా తెరపైకి తీసుకు వస్తారా లేదా అన్నది పోలీసుల ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారం బయట పడిన సమయంలో అద్దేపల్లి జనార్దన్ రావును సౌతాఫ్రికా నుంచి రప్పించి అరెస్టు చేశారు. అద్దేపల్లి బ్రదర్స్ తో కలిసి జోగి రమేష్ నకిలీ మద్యం వ్యాపారం చేసినట్లు జనార్దన్ రావు వీడియో విడుదల చేసారు. ఆ వీడియో రాజకీయంగా సంచలనంగా మారింది. ఆ తరువాత విచారణ సమయంలోనూ తనకు జోగి రమేష్ తో ఉన్న వ్యాపార సంబంధాల గురించి జనార్ధన రావు వివరించినట్లు తెలిసింది. జోగి రమేష్ కు రిమాండ్ విధించిన తరువాత నెల్లూరు జైలుకు తరలించారు. వైసీపీ నేతలు పరామర్శించారు. జోగి రమేష్ అరెస్ట్ పైన మాజీ సీఎం జగన్ సైతం ప్రభుత్వం పైన విమర్శలు చేసారు. ఇక.. ఇప్పుడు ములకలచెరువు కేసులో బెయిల్ రావటంతో.. జోగి బయటకు వస్తారని చెబుతున్నా... మిగిలిన కేసుల అంశం ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది. అయితే, ఈ సాయంత్రమే ఇద్దరూ విడుదల అవుతారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications