మోడీకి ఓటేయండి, తొలిసారి అడుగుతున్నా: కెఏ పాల్

స్కాములతో నాయకులు ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, పిల్ల కాంగ్రెసులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తాను టిడిపి తరఫున ప్రచారానికి సిద్ధమన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్లవల్ల అవినీతి దేశ సరిహద్దులు దాటి విస్తరించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని సక్రమ మార్గంలో నడిపేందుకు ఎన్డీయే, చంద్రబాబుల సమర్థ పాలన అవసరమన్నారు.
తాను ఇప్పటి వరకు ఏ రాజకీయపార్టీ కార్యాలయంలోకి వెళ్లలేదని, తొలిసారి టిడిపి కార్యాలయంలోకి వచ్చి సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నట్లు చెప్పారు. మైనారిటీలందరూ మోడీకి, టిడిపికి మద్దతు పలకాలన్నారు. మైనారిటీ సోదరులు తాము ఓటేయడంతోపాటూ ఇతరులకూ చెప్పి ఎన్డీయే, టిడిపికి ఓటేయించేలా చొరవ తీసుకోవాలన్నారు. ఈ నెల 5న చంద్రబాబు తనను కలిసి మద్దతు కోరారని, మూడు నెలల క్రితం కెసిఆర్ సైతం తనను కలిశారని చెప్పారు.
అందరూ తనను కలిసి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. అయితే, బాబు పరిపాలనదక్షతను వ్యతిరేకులు సైతం అంగీకరిస్తారన్నారు. తానెప్పుడూ టిడిపికి ఓటేయాలని చెప్పలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం సైకిల్ గుర్తును ఎంచుకోవాలన్నారు. రాజకీయాలు.. మతం వేరు కాదని, దేశంలో పార్టీలన్నీ లౌకికవాద పార్టీలే అన్నారు.
-
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై మూడు కాదు నాలుగు !! -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications