ఏపీ సీఎంవో కేంద్రంగా జెత్వానీపై కుట్ర! డీజీపీ సంచలన రిపోర్ట్-ఐపీఎస్ ల అరెస్ట్?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగనన్ కు సన్నిహితుడైన ఓ ముంబై పారిశ్రామికవేత్తను కాపాడే క్రమంలో నటి కాదంబరీ జెత్వానీని అరెస్టు చేసి ఆమెను కుటుంబంతో సహా వేధించిన కేసులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి.
జెత్వానీనీ వేధించిన వ్యవహారంలో తాజాగా అరెస్టు అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు అప్పట్లో ఏం చేశారో డీజీపీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక బయటపెట్టింది. ఈ నివేదికలో అప్పటి సీఎంవో కేంద్రంగా సాగిన కుట్ర బట్టబయలైంది.

ఈ ఏడాది జనవరి 31న ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీని సీఎంవోకు పిలిపించడంతో ఈ కుట్ర మొదలైంది. ముంబై నటి కాదంబరి జెత్వానీని ఎట్టి పరిస్ధితుల్లోనూ అరెస్టు చేయాలంటూ కాంతి రాణా టాటాకు పీఎస్సార్ ఇచ్చిన మౌఖిక ఆదేశం ఇందులో కీలకమైనది. ఆ తర్వాత ఫిబ్రవరి 2న ఆమెపై కేసు నమోదు చేశారు. అంటే కేసు నమోదు కూడా కాకుండానే జెత్వానీ అరెస్టుకు ఆదేశాలు వెళ్లాయి.
పీఎస్సార్ చెప్పిన నోటిమాట ఆధారంగానే కాంతిరాణా టాటా జెత్వానీ అరెస్టుకు ముందే ముంబైకి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేయించేశారు. జనవరి 31న జెత్వానీని అరెస్టు చేయాలని కాంతిరాణా టాటా డీసీపీ విశాల్ గున్నీని ఆదేశిస్తే ఆయన ఫిబ్రవరి 1నే అంటే అరెస్టుకు ముందే పోలీసులు ముంబైకి వెళ్లేందుకు టికెట్లు కూడా తీశారు. మొత్తం మీద పీఎస్సార్ నోటిమాటతోనే ముంబైలో ఉన్న జెత్వానీని అరెస్టు చేసేందుకు విజయవాడ కమిషనరేట్ పోలీసుల టీమ్ ముంబైకి వెళ్లడం, ఆమెను అక్రమ కేసులో అరెస్టు చేయడం, విజయవాడ తీసుకొచ్చి వేధించడం, కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపడం జరిగిపోయాయి.
దీనిపై డీజీపీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పీఎస్సార్ తో పాటు ఈ వ్యవహారాన్ని నడిపించిన కాంతి రాణా టాటా, విశాల్ గున్నీని ప్రభుత్వం నిన్న సస్పెండ్ చేసింది. ఇప్పుడు వీరిని అరెస్టు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జెత్వానీ నేరుగా చేసిన ఫిర్యాదు ఆధారంగా పలువురు పోలీసు అధికారులపై వేటు పడుతోంది. త్వరలో మరింత మందిని సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అదే జరిగితే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాబోతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications