చంద్రబాబు సస్పెన్షన్ నిర్ణయాన్ని సమర్థించిన జగన్ పార్టీ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని సస్పెండ్ చేయడం సరైందేనని, అయితే, ప్రజల దృష్టి మరల్చేందుకే ఆయనపై సీఎం చంద్రబాబు వేటు వేశారని వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని సస్పెండ్ చేయడం సరైందేనని, అయితే, ప్రజల దృష్టి మరల్చేందుకే ఆయనపై సీఎం చంద్రబాబు వేటు వేశారని వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం అన్నారు.
వాకాటిపై కేసుల గురించి, ఆరోపణల గురించి తాము ముందే చెప్పామని, అయినా ఆయనకు టిక్కెటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి రూ.440 కోట్లు అప్పు తీసుకొని ఎగ్గొట్టారన్నారు. చంద్రబాబు చుట్టూ వందల మంది విజయ్ మాల్యాలు ఉన్నారన్నారు.

కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాస రావు, రాయపాటి సాంబశివ రావు, సీఎం రమేష్ తదితరులపై చంద్రబాబు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాకాని ప్రశ్నించారు. అక్రమ కేసులతో ప్రజాప్రతినిధులను భయపెట్టిన ఘనత చంద్రబాబుదన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. సీబీఐ దర్యాఫ్తు చేయించుకొని క్లీన్ చిట్ తెచ్చుకునే ధైర్యం ఉందా అని సవాల్ చేశారు. టిడిపిలో ఆర్థిక నేరాలు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలన్నారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications