జగన్ వల్లే సాధ్యం: వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ, అనుచరులు
తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్పాండ్లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.
దుర్గేష్తో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి వైయస్ జగన్ పోరాటాల వల్లే సాధ్యమన్నారు.
సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. వైయ జగన్ ప్రజల పక్షాన నిలుస్తున్నారని అన్నారు. అందుకే జగన్ నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని దుర్గేష్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నాబాబు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. కాగా, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దుర్గేష్ ఎమ్మెల్సీగా పని చేశారు.