భయపడను బుల్లెట్లా దూసుకెళ్తా, కేసీఆర్పై కేసు పెట్టాలి: బాబు, ప్రభుత్వంచే ఆ వీడియోలు రిలీజ్
చేబ్రోలు: తాను ఎవరికీ భయపడనని, బుల్లెట్లా దూసుకుపోతానని, తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెరాస పైన కేసు పెట్టాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా చేబ్రోలులో చంద్రబాబు జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కేబినెట్లో చేర్చుకోవడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ పైన కేసు పెట్టాలని భగ్గుమన్నారు. తెరాస నీతిమాలిన పనులు చేస్తోందన్నారు.

తెలంగాణలో టీడీపీ ఉండకూడదనే కక్షతో టీఆర్ఎస్ వెళ్తోందన్నారు. 16 కేసుల్లో నిందితుడిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రేవంత్ వ్యవహారంపై ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు విజయవాడలో మాట్లాడారు.
ఆ సీడీలను ఏసీబీ విడుదల చేయలేదని, ప్రభుత్వమే విడుదల చేసిందని తెలుస్తోందన్నారు. 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్కు 85 ఓట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. రేవంత్ వ్యవహారంలో తెరాస కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టాలనడం కక్ష సాధింపునకు పరాకాష్ట అని ఏపీ మంత్రి యనమల అన్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్












Click it and Unblock the Notifications