నయా రజాకార్లు: కెసిఆర్పై రాపోలు, రజ్వీ వారసులని..

తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం, తెలంగాణ స్వాతంత్ర్య సేనాని సమితి ఆధ్వర్యంలో కోఠిలోని అమరవీరుల స్తూపం వద్ద బుధవారం తెలంగాణ ఆత్మగౌరవ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సారథ్య బృందం అధ్యక్షుడైన రాపోలు ఆనందభాస్కర్, తదితర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం కెసిఆర్ ప్రభుత్వ అవకాశవాదానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కెసిఆర్ అవకాశవాద రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ అని తెలంగాణ పిసిసి అధ్యక్షు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ వల్లే ఏర్పడిందని చెప్పారు.
ప్రజాతీర్పును స్వాగతీస్తున్నాం: జానారెడ్డి
మెదక్ ఉప ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి స్పష్టం చేశారు. టిఆర్ఎస్ను ప్రజలు నమ్మినంతకాలం ఫలితాలు ఇలాగే ఉంటాయని అన్నారు. హామీలన్నింటినీ అమలు చేసి ఆ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నా తమకు అభ్యంతరం లేదని చెప్పారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications