వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళితులకు భూమి: పట్టాలిచ్చిన కెసిఆర్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన దళితులకు భూపంపిణీ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శ్రీకారం చుట్టారు. భూమిలేని దళిత కుటుంబాలకు మూడేసి ఎకరాల చొప్పున ఇస్తూ తొలి ఏడాది సాగు ఖర్చులు కూడా ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

హైదరాబాదులోని గోల్కొండ కోటలో జాతీయ పతాకను ఆవిష్కరించిన తర్వాత కెసిఆర్ దళితులకు భూమి పట్టాలు అందజేశారు. ఒక్కో జిల్లా నునంచి ఇద్దరేసి లబ్ధిదారులను ఎంపిక చేసి ఆయన పట్టాలు అందజేశారు.

గోల్కొండలో జాతీయ పతాకను ఆవిష్కరించడానికి ముందు కెసిఆర్ సికింద్రాబాదులోని పరేడ్‌గ్రౌండ్స్‌లో అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం తగిన రీతిలో గౌరవిస్తుందని విజిటర్స్ బుక్కులో రాశారు.

పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

దళితులకు మూడెకరాల భూమిని పంచి పెట్టే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర రావు లబ్ధిదారుకు పట్టా ప్రదానం చేశారు.

పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు లబ్ధిదారులను ఎంపిక చేసి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కెసిఆర్ భూమి పట్టాలు ఇచ్చారు.

పట్టాల పంపిణీ

పట్టాల పంపిణీ

దళితులకు భూమి పట్టాలు పంపిణీ చేసిన సందర్భంలో ఓ మహిళ తన పట్టా కాగితాన్ని కెసిఆర్ కాళ్ల వద్ద ఉంచుతూ ఇలా..

జాతీయ పతాకను ఆవిష్కరిస్తూ...

జాతీయ పతాకను ఆవిష్కరిస్తూ...

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకను ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇలా..

జెండా వందనం సందర్భంగా ఇలా...

జెండా వందనం సందర్భంగా ఇలా...

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకను ఆవిష్కరించి గౌరవ వందనం చేసిన తర్వాత కెసిఆర్ ఇలా...

అమర జవాన్లకు నివాళులు....

అమర జవాన్లకు నివాళులు....

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకను ఆవిష్కరించడానికి ముందు కెసిఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అమర జవాన్లకు నివాళులు అర్పించారు.

అమర జవాన్లకు నివాళులు..

అమర జవాన్లకు నివాళులు..

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అమర జవాన్లకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నివాళులు అర్పించారు.

కెసిఆర్ ఇలా...

కెసిఆర్ ఇలా...

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమర జవాన్లకు నివాళులు అర్పించిన సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో కెసిఆర్ ఇలా...

English summary

 Telangana CM K chandrasekhar Rao distributed pattas in launching programme of land distribution to Dalits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X