మాజీ మంత్రి నారాయణ కేసులో కీలక పరిణామాలు
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్ట్ అయిన నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు జిల్లా నాలుగో అదనపు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. నారాయణ రాకుండా జామీను తీసుకోవడం కుదరదని సోమవారం కోర్టు నారాయణ లాయర్లకు చెప్పడంతో ఆయనకు బెయిల్ వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈరోజు కోర్టు ఇద్దరి జామీను తీసుకొని బెయిల్ మంజూరు చేసింది.
నారాయణ బెయిల్ మంజూరునకు సంబంధించిన జామీనుదారుల పూచీకత్తును చిత్తూరు కోర్టు ఆమోదించింది. చిత్తూరు పోలీసులు ఈ కేసులో గత వారమే నారాయణను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా బెయిలు మంజూరు చేసింది. ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. దీనికి ఐదురోజుల గడువు తీసుకున్న నారాయణ లాయర్లు ఇద్దరి పూచీకత్తును సోమవారం కోర్టుకు సమర్పించారు.

నారాయణ రాకుండా జామీను తీసుకోవడం కుదరదని న్యాయమూర్తి అభ్యతరం తెలిపారు. ఆయన్ను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. ఇటువంటి కేసుల్లో ఉన్నత న్యాయస్థానాలిచ్చిన తీర్పులను నివేదించడానికి సమయం కోరారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. నారాయణ లాయర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు ఆయన రాకుండానే పూచీకత్తును ఆమోదించింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications