ఆలీకి కీలక పదవి..! టీటీడి బోర్డ్ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జగన్..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పదవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవుల తర్వాత మిగిలిన నామినేటెడ్ పదవుల పైన సీఎం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. పవర్ ఫుల్ పదవిగా చెప్పే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవి తర్వాత అందరి చూపు ఇప్పుడు బోర్డ్ సభ్యులపై పడింది. ఈ కీలక పదవుల్లో ఎవరికి అవకాశం కల్పించాలా అనే అంశం పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గజన్ కు అత్యంత సన్నిహితులే కాకుండా వివిధ రాష్ట్రాలనుండి వస్తున్న పైరవీలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని జగన్ సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవే విషయంపై జగన్ తుది నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు త్వరలో జారీ కానున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా సినీ హాస్య నటుడు ఆలీకి కూడా కీలక పదవి కట్టబెట్టేందుకు సీఎం జగన్ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

చంద్రబాబు ప్రభుత్వం చివరి రోజుల్లో, ఎన్నికల కీలక తరుణంలో విపక్ష వైసీపీకి అండగా నిలిచిన సినీ ప్రముఖులను సీఎం జగన్ మర్చిపోలేదు. వారికి సముచిత రీతిలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. వారిని సంతృప్తిపరిచేందుకు పదవులు పంచుతున్నారు. టాలీవుడ్ పెద్దలంతా చంద్రబాబు వెంట ఉంటే.. ఫృథ్వి, అలీ, జీవిత రాజశేఖర్, పోసాని వంటి కొందరు మాత్రం జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఎన్నికలకు నెల ముందే జగన్ కు కమెడియన్ అలీ జై కొట్టారు. ఎవరు మంత్రి పదవి ఇస్తే వారి పార్టీలోనే చేరతానని తొందరపాటుగా ప్రకటించడం ద్వారా కొంత ఇబ్బంది పడ్డారు. చివరికి, వైసీపీలోనే చేరారు.
అలీ ఎమ్మెల్యే టికెట్ హామీపైనే వైసీపీలో చేరినా లాస్ట్ మినట్ లో జగన్ ఇవ్వలేకపోయారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారట. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పోస్టులపై జగన్ దృష్టి సారించారు. కమెడియన్ పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం టీవీ (ఎస్వీబీసీ) చానెల్ చైర్మన్ పదవిని ఇవ్వబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వైసీపీ గెలుపు కోసం పాటుపపడిన అలీ ఇప్పుడు వైసీపీ పెద్దలను తన సంగతేమిటని సుతిమెత్తగా కోరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీగానీ, ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవిగానీ ఇవ్వొచ్చని సమాచారం. ఫృథ్వీని కరుణించిన జగన్ అలీపై కూడా త్వరలోనే దృష్టి సారిస్తారనే చర్చ జరుగుతోంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications