కిరణ్ తన మాటే తాను వినరు: విభజనపై లగడపాటి
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఒక్కసారి కట్టుబడిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తన మాట తానే వినరని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలో శనివారం ఏర్పాటైన రచ్చబండ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సమైక్యాంధ్ర కోసం కిరణ్ కుమార్ రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు.
విభజన జరిగితే రాష్ట్రం రగిలిపోతుందని, తెలుగుజాతి గుర్తింపు లేకుండా పతనమవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదనతో రగిలిపోతున్నారని ఆయన అన్నారు. సమైక్య ఉద్యమం వంద రోజులతో ముగిసి పోలేదని, ముందు ముందు అసలు ఉద్యమం ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ట్రైలర్ మాత్రమే చూశామని, ఇక అసలు ఉద్యమం చూస్తామని ఆయన అన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమం ఆగిపోలేదని, ప్రతి గుండె రగిలిపోతోందని ఆయన అన్నారు. విభజన జరిగితే చుక్క నీరు కూడా రాదని రైతులు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే సత్తా కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరికే ఉందని మంత్రి పార్థసారథి అన్నారు.
సమైక్యాంధ్ర కోసం కట్టుబడిన నేత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమేనని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రికి ప్రజల మద్దతు కావాలని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో సమైక్య గళం వినిపించిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్ర కోసం తాను పదవీ త్యాగానికైనా సిద్ధమని ఆయన చెప్పారు. కేంద్రాన్ని, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే రీతిలో ఆయన ప్రసంగించిన విషయం కూడా తెలిసిందే. దీంతో కృష్ణా జిల్లాలోని రచ్చబండ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications