టీలో కిరణ్ పార్టీ అభ్యర్థులు: 21 అసెంబ్లీ సీట్లకు వీరే
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ తెలంగాణలోనూ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలంగాణలో పోటీ చేసే తన అభ్యర్థుల తొలి జాబితాను మంగళవారం విడుదల చేసింది. 21 శాసనసభా స్థానాలకు, మూడు శాసనసభా స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
తెలంగాణలో నామినేషన్లకు రేపు బుధవారంతో గడువు ముగుస్తుంది. జై సమైక్యాంధ్ర పార్టీ ఖమ్మం జిల్లాలో ఎక్కువ సీట్లకు పోటీ చేస్తోంది. నల్లగొండ జిల్లాలో ఒక్క స్థానానికి మాత్రమే పోటీ చేస్తుంది. మూడు లోకసభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోకసభ స్థానం నుంచి చెరుకూరు నాగార్జునరావు పోటీ చేయనున్నారు.

సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి శ్రీనివాస రావు, నల్లగొండ జిల్లాలోని భువనగిరి సీటు నుంచి జనార్దన్ రెడ్డి పోటీ చేస్తారు. సీమాంధ్రలో అభ్యర్థుల ప్రకటనకు ఇంకా గడువు ఉంది.
జెఎస్పీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా
ఆలేరు - నర్సింగోజు నర్సింహాచారి
పినపాక - కనిపి కృష్ణ
ఇల్లందు - ముక్తిరాజు
ఖమ్మం - షేక్ బాషా
పాలేరు - అప్పల లింగమూర్తి
మథిర - మల్లు శివరాం
వైరా - వాసం రామకృష్ణం దొర
సత్తుపల్లి- సమ్మల రాజేష్ కుమార్
కొత్తగూడెం - నార్ల సత్యనారాయణ
అశ్వారావుపేట - పాయం పోతయ్య దొర
భద్రాచలం- కురుపం సుబ్బారావు
నర్సాపూర్ - ఎండి వాజద్ అలీ
పటాన్ చెరు - సుహాసినీ కొడాఠి
మల్కాజిగిరి - పిట్ల శ్రీన్ రాజు
ఎల్బీ నగర్ - గున్నం నరేందర్ రెడ్డి
రాజేంద్ర నగర్ - సయ్యద్ ఉమర్
ముషీరాబాద్ - రాణి గడాఫీ
ఖైరతాబాద్ - రాజు
జూబ్లీహిల్స్ - సుదర్శనం వెంకటేశ్వర్లు
సనత్నగర్ - చర్లపల్లి నీతాగౌడ్
చార్మినార్ - మహ్మద్ అయూబ్ ఖాన్












Click it and Unblock the Notifications