హైదరాబాద్లో బతకలేం: షిండేకు కిశోర్ చంద్రదేవ్ లేఖ

తెలంగాణ విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిన నేపథ్యంలో కిశోర్ చంద్రదేవ్ ఈ లేఖ రాశారు. హైదరాబాద్లో తెలంగాణేతరుల ఆస్తులకు భద్రత కల్పించాలని కూడా ఆయన కోరారు. హైదరాబాద్లో అద్దెకు ఉంటున్న తెలంగాణావారు తెలంగాణేతరులను ఇవన్నీ మావి, మీరు సీమాంధ్రకు వెళ్లిపోతే ఇవన్నీ మావేనంటున్నారని, ఇటువంటి పరిస్థితులలో రక్షణ కల్పించవలసిన బాధ్యత కేంద్రంపై ఉన్నదనీ కిశోర్ వివరించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్లో స్థిర పడిన సీమాంధ్రులలో రోజురోజుకీ భయాందోళనలు పెరుగుతున్నాయని, వారి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందనీ, అందువల్ల వారి భద్రకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. విభజన అనంతరం విశాఖపట్నాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు.
సీమాంధ్రకు చెందిన మరో కేంద్ర మంత్రి చిరంజీవి - హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కోరుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తేనే సీమాంధ్ర ప్రజల్లోని ఆందోళన సద్దమణుగుతుందని ఆయన అన్నారు.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications