అలా చెబితే సిగ్గేస్తోంది: కెకె, రిమోట్ మీ వద్దే: నాయిని
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక్క విద్యార్థికి బెయిల్ ఇప్పించలేని కాంగ్రెసు పార్టీ నేతలు ఇప్పుడు తామే తెలంగాణను తెచ్చామంటే సిగ్గేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు బుధవారం అన్నారు. కాంగ్రెసు వస్తే తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందో లేక ఆంధ్ర ప్రజలకు అండగా ఉంటుందో తేల్చుకోవాలన్నారు.
తెలంగాణను ఎవరిచ్చారో, ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసునని చెప్పారు. అసలు సిసలైన ఉద్యమం ఇప్పుడే ప్రారంభమవుతుందన్నారు. పదమూడేళ్ల తెలంగాణ ఉద్యమం కంటే రానున్న ఐదేళ్లు పరీక్షా సమయం అన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం జరిగే వరకు తెరాస ఉద్యమం ఆగదన్నారు.

ఉద్యోగులకు ఆప్షన్ దారుణమన్నారు. ఉద్యోగాల్లో తెలంగాణ వాటాలో అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ సమస్యల పైన పోరాడే వ్యక్తి కెసిఆర్ మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఇంకా మిగిలే ఉంటాయని చెప్పారు.
కాంగ్రెసు పార్టీకి అధికారం ఇస్తే రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉంటుందని, అదే తెరాసకు ఇస్తే ప్రజల చేతుల్లో ఉంటుందని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. తెరాసకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండని కోరారు. తెరాసతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. కెసిఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పారు.
ఆంధ్రా పార్టీలకు అమ్ముడు పోతుంది: యాష్కీ
తెరాసపై కాంగ్రెస్ లోకసభ సభ్యుడు మధుయాష్కీ విరుచుకుపడ్డారు. అధికారం కోసం ఎలాంటి గడ్డి తినడానికైనా తెరాస సిద్ధంగా ఉందన్నారు.ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రా పార్టీలకు అమ్ముడు పోతుందని ఆరోపించారు. తెలంగాణ ద్రోహులైన కొండా దంపతులను చేర్చుకున్న తెరాస... అమరవీరుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతుందన్నారు.తెలంగాణ పునర్నిర్మాణమంటే దొరలు, గడీల రాజ్యం కాదన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications