నేనలా చెప్పలేదు, కోడిగుడ్డుపై ఈకలు పీకడం సరి కాదు: కోడెల
హైదరాబాద్: ఎన్నికల్లో తాను 11 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్లు ఎక్కడా చెప్పలేదని, కోడిగుడ్డుకు ఈకలు పీకడం సరి కాదని ఆంధ్రప్రదేశ్ శానససభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు స్పష్టం చేశారు. ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యం పెరిగిందని మాత్రమే తాను చెప్పానని ఆయన అన్నారు.
డబ్బులు ఎక్కువ ఖర్చయ్యాయనని తాను అన్నానని, 11 కోట్ల రూపాయల ఖర్చు చేశానని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. మైదుకూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు రఘురామిరెడ్డి రాజీనామా లేఖ తనకు అందలేదని కోడెల శివప్రసాద రావు శనివారంనాడు మీడియాతో చెప్పారు.

'అన్న ఎన్టీఆర్ పిలిచి సీటు ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యం పెరిగింది. 1983లో రూ.30 వేలు ఖర్చు పెట్టి గెలిచా. మొన్న ఎలక్షన్లలో రూ.11 కోట్లు ఖర్చు పెట్టాను. ఎన్నికల ఖర్చు కోసం కొందరు అవినీతికి పాల్పడుతున్నారు.' అని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి.
కాగా, కోడెల శివప్రసాద రావుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయన అంబటి రాంబాబు తదితర వైసిపి నేతలు ఫిర్యాదు చేశారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications