రాజధానిపై డొక్కా కొత్త వాదన: సిఎంపై ఐటి ఐకాస ఫైర్

Dokka Manikya Vara Prasad
గుంటూరు/హైదరాబాద్: రాష్ట్రం విడిపోదని, ఒకవేళ విడిపోతే కొండవీడును సీమాంధ్రకు రాజధానిగా చేయాలని మంత్రుల బృందానికి(జివోఎం) సూచించినట్లు మంత్రి డొక్కా మాణక్యవర ప్రసాద్ మంగళవారం గుంటూరులో అన్నారు. కొండవీడు సిడి ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై ఏర్పడిన కమిటీలోని కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్‌లతో తాను సీమాంధ్ర రాజధాని అంశాన్ని చర్చించినట్లు చెప్పారు.

తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయలు, కవులను గుర్తు చేసే చారిత్రక నేపథ్యం ఉన్న కొండవీడు, అమరావతిని సీమాంధ్ర రాజధానిగా చేయాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మేలని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి స్పష్టం చేశారు.

కిరణ్‌పై టి ఐటి ఐకాస ఆగ్రహం

ఐటీ రంగంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాదనలు సరికాదని తెలంగాణ స్టేట్ ఐటి ఐక్యకార్యాచరణ సమితి ఆరోపించింది. ఐటి, ఫార్మారంగాల్లో 90 శాతం హైదరాబాద్ వారే ఉన్నారని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పడాన్ని ప్రస్తావించారు. ఐటి, ఫార్మా రంగాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి సంబంధించినవని, ఇందులో అవకాశాలు మెరిట్ ప్రాతిపదికనే లభిస్తాయన్నారు.

విశ్వ విద్యాలయాల విషయంలోనూ సీమాంధ్రలో 21 ఉంటే, తెలంగాణలో 13 మాత్రమే ఉన్నాయన్నారు. ఐఐటి, ఐఎస్‌బి, హెచ్‌సియూ వంటి విశ్వవిద్యాలయాల ప్రవేశాలు జాతీయ స్థాయిలో ఉంటాయని గుర్తు చేశారు. కాబట్టి సీమాంధ్ర విద్యార్థులకు ఎలా సమస్యలు వస్తాయని ప్రశ్నించారు. హైదరాబాద్ శాంతిభద్రతల విషయంలోనూ సిఎం అప్రజాస్వామికంగా మాట్లాడారన్నారు.

ఉమ్మడి రాజధానిని ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరమితం చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం, మునగాల ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలనే నైతిక హక్కు ఆ ప్రాంతం వారికి లేదన్నారు. తెలంగాణ నీరు, బొగ్గును తరలించుకుని సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడం వల్లే ఇక్కడ సమస్య ఏర్పడిందన్నారు. కృష్ణా జలాల పంపకంపై స్పష్టత ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+