గోదావరి పుష్కరాల ముహూర్తం ఫిక్స్, 97 ఘాట్లు ఖరారు - ఈ సారి ప్రత్యేకంగా..!!
గోదావరి పుష్కరాల ముహూర్తం ఫైనల్ అయింది. అనేక చర్చల తరువాత పండితుల సూచనల మేరకు ముహూర్తాన్ని ఖరారు చేసారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్రం నిధులను మంజూరు చేసింది. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం పనుల నిర్వహణ కోసం కమిటీ ప్రకటించింది. కాగా, పుష్కరాలు ఖరారు అయ్యాయి. ఈ సారి గోదావరి పుష్కరాలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు ఈ పుష్కరాలను నిర్వహించాలని సర్కారు నిర్ణయించారు. దాదాపు 8 కోట్ల మంది భక్తుల వస్తారన్న అంచనాతోపాటు, ప్రత్యేక రోజుల్లో గరిష్ఠంగా 75,000 మంది వరకూ వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే హాజరయ్యే భక్తుల అంచనాతోపాటు వివిధ సౌకర్యాల గురించి చర్చలు జరిపారు. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి ప్రవహిస్తునందున ఈ ప్రాంతాలలో పుష్కర పనులు వేగవంతమయ్యేలా చూస్తుంది. తాజాగా దీనికి సంబంధించి పలు శాఖలు సమీక్ష నిర్వహించారు.

పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్య ఇస్తూ.. రద్దీ నియంత్రణ పైన ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఘాట్లో 50 మీటర్లకు ఒక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు ఇందులోనే 10 సామాజిక మరుగుదొడ్లు, రెండు దుస్తులు మార్చే గదులు, 6 వాటర్ ఏటీఎంలు, అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రతి భక్తుడు ఘాట్లోకి వెళ్లి పుణ్యస్నానం చేసి 15 నిమిషాల్లో బయటకొస్తారని అంచనా వేశారు. ప్రతి కంపార్ట్మెంట్ నుంచి ఒక రోజు (18 గంటలు)లో 44,928 మంది పుణ్యస్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు. గోదావరికి ఇరు వైపులా 7.06 కిలోమీటర్ల మేర 97 ఘాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా తూర్పువైపు 4.93 కిలోమీటర్ల పరిధిలో 45 ఘాట్లను అధికారులు సిద్ధం చేస్తారు.
ఇక, దేవాదాయ శాఖ కూడా ఇటీవల సమీక్షను ఏర్పాటు చేసింది. దీంట్లో ముఖ్యంగా ఏయే తేదీల్లో పుష్కరాలు నిర్వహించాలనే దానిపై చర్చించారు. ఈ సమావేశంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలకు చెందిన ఆగమ, వైదిక పండితులు, తితిదే ఆస్థాన సిద్ధాంతితో కలిపి మొత్తం 16 మంది పాల్గొని పుష్కరాల తేదీలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. పుష్కరాలను 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించాలని ఆగమ, వైదిక పండితులు సమీక్షలో సూచించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ నివేదికను పరిశీలించి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకొని, నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. అటు కేంద్రం.. రైల్వే శాఖ సైతం పుష్కరాల ఏర్పాట్లలో ముందుకు వచ్చాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications