Jaahnavi Kandula: కర్నూలు విద్యార్దిని చావుకు అమెరికా రూ.262 కోట్ల పరిహారం..!
అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కర్నూలు విద్యార్ధిని కందుల జాహ్నవి (jaahnavi kandula) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కుమార్తె చావుకు పోలీసులు కారణమైనందున అమెరికా చట్టాల ప్రకారం భారీ పరిహారం చెల్లించాలని ఆమె తల్లితండ్రులు చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం దక్కింది. ఎట్టకేలకు జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది.
2021లో అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన కర్నూలు విద్యార్ధిని కందుల జాహ్నవి.. 2023 జనవరి 23న సియాటిల్ లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన జాహ్నవి అక్కడికక్కడే చనిపోయింది. అదే సమయంలో వాహనం నడిపిన పోలీసు అధికారి కెవిన్ డవే.. ఆమె ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువలేదంటూ చౌకబారు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదంతా ఆయన బాడీ కెమెరాలోనే రికార్డ్ అయింది.

ఆ వ్యాఖ్యలపై భారత్ కూడా నిరసన తెలిపింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరిపిన సియాటిల్ పోలీసులు.. సదరు అధికారిని విధుల నుంచి తప్పించారు. 40 కిలోమీటర్ల వేగం అనుమతి ఉన్న రోడ్డుపై 119 కిలోమీటర్ల వేగంతో వచ్చి జాహ్నవిని అతని వాహనం ఢీకొట్టినట్లు గుర్తించారు. దీంతో ఆమె తల్లితండ్రులు న్యాయపోరాటం చేశారు. చివరికి దిగొచ్చిన సియాటెల్ ప్రభుత్వం.. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించి కేసు సెటిల్ చేసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సెటిల్మెంట్ తో ఆమె కుటుంబానికి కాస్తయినా ఉపశమనం దక్కుతుందని స్థానిక అటార్నీ ఈ ప్రకటనలో తెలిపారు.
-
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
Iran War: ట్రంప్ సీజ్ ఫైర్ ప్లాన్ పై తేల్చేసిన ఇరాన్- కీలక ప్రకటన..! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications