ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు మంగళవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీలకు వ్యతిరేకంగా సభా హక్కుల తీర్మానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఈనెల 22న రాజ్యసభలో ఓటింగ్ జరగాల్సి ఉంది.
అయితే ఓటింగ్ జరగాల్సిన సమయంలో బీజేపీ సభ్యులు రాజ్యసభలో గందరగోళం సృష్టించి ఓటింగ్ జరగకుండా చేసి తన హక్కులకు భంగం కలిగించారని కనుక వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ కేవీపీ మంగళవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజె కురియన్కు నోటీసు అందజేశారు.
ఈ నోటీసు వల్ల మంగళవారం కూడా రాజ్యసభలో గందరగోళం నెలకొనడంతో పాటు పలుమార్లు వాయిదా పడింది. కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేసినప్పటికీ, డిప్యూటీ ఛైర్మన్ పీజె కురియన్ సైతం ఈరోజు బిల్లుకు ఓటింగ్ నిర్వహించడం సాధ్యపడదని తేల్చి చెప్పారు.

ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?
అయితే బీజేపీ ఎంపీలు తన బిల్లుకి అడ్డుపడడ్డారని అరోపిస్తున్న కేవీపీ, 22న కాంగ్రెస్ సభ్యులు కూడా పోటీపడి మరీ సభలో నినాదాలు చేసిన సంగతిని విస్మరించారనే వాదన వినిపిస్తోంది. అటు కాంగ్రెస్, ఇటీ టీడీపీ రెండు పార్టీలు ఏపీకి ప్రత్యేకహోదా రాకుండా నాటకాలు ఆడుతున్నాయంటూ రాష్ట్ర ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?
రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును సభకు రాకుండా అడ్డుకున్నామని ఢిల్లీలోని పెద్దలు సంతోషపడినప్పటికీ, రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా రాదనే సంగతి ప్రజలకు సైతం తెలుసు.

ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?
ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ ప్రవేశపెట్టిన బిల్లునే తెలివిగా సభకు రాకుండా అడ్డుకున్న బీజేపీ, కేవీపీ ఇచ్చిన సభా హక్కుల నోటీసుని పక్కకు పెట్టేస్తుందని కాంగ్రెస్కు ముందుగానే తెలుసు. అయినప్పటికీ ఈ సభాహక్కుల నోటీసు ఇచ్చి మంగళవారం రాజ్యసభలో కాసేపు గందరగోళం సృష్టించవచ్చనే ఉద్దేశంతోనే ఉన్నట్టుగా మంగళవారం సభ జరిగిన తీరు చూస్తుంటే తెలుస్తోంది.

ఏపీకి హోదా పైట్: కేవీపీ సభాహక్కుల నోటీసు, దేని కోసం?
అంతేకాదు ఏపీకి ప్రత్యేకహోదా కోసం మేము పోరాడుతుంటే బీజేపీ మాత్రం దానిని అడ్డుకుంటోదని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్లి ఆలోచనతోనే ఈ సభాహక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు సభలో తాము ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, బీజేపీ తమ హక్కులని కాలరాసిందని చెప్పుకొని ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేయవచ్చు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications