మహిళ బట్టలు మార్చుకుంటుండగా గొలుసు కాజేసిన మహిళా దొంగ
ఒంగోలు: ఓ అంతర్రాష్ట్ర దొంగతో పాటు, మరో మహిళా దొంగను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.11.5 లక్షల విలువ గల ఒక టిన్నర కేజీల బంగారు ఆభరణా లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను ఒంగోలు, సిసిఎస్ డిఎస్పీలు గుం టుపల్లి శ్రీనివాసరావు, వెంక టేశ్వరరావు సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుల్లపల్లికి చెందిన నల్లబోతుల వనమాల అనే మహిళా దొంగను అరెస్టు చేసి అమె వద్ద నుంచి రూ.1.42 లక్షలు విలువ గల ఏడున్నర సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మాలకొండ స్వామి గుడి వద్ద స్నానం చేసి బట్టలు మార్చుకొను సమయంలో ఆడమనిషి మెడలోని బంగారు నల్లపూసల దండ దొంగలించింది.
కాగా, కందు కూరు పట్టణంలో నకిలీ బంగారు ఆశ చూపి మహిళా మెడలో బంగారు ఆభ రణాలు దోచుకున్న కేసులో కూడా ఆమె ముద్దాయిగా ఉంది. ఆమెను సోమవారం జడ్పీ కార్యాలయం సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన దొంగతనాలను ఒప్పుకున్నట్లు శ్రీనివాసరావు, వెంకటేశ్వర రావు తెలిపారు.
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం తాటిమాకులపాలెం గ్రామానికి చెందిన అంతరాష్ట్ర దొంగ జోగి శ్రీనివాసులును అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.9,70,200 రూపాయలు విలువ గల 49 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు, రూ.5వేల విలువ చేసే 150 గ్రాముల వెండి దీపారాధన కుందులు, రూ.30వేలు విలువ చేసే ఎల్సిడి కలర్ టీవీ, డివిడి ప్లేయర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
పాత నేరస్తులపై నిఘా పెట్టి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ నెల 15వ తేది ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డులో సంఘమిత్ర హాస్పిటల్ వద్ద పై ముద్దాయిను అదుపులోకి తీసుకొని విచారించగా అక్టోబర్ చివరి వారంలో వరుసగా జరిగిన ఆరు ఇంటి దొంగతనాలతో పాటు, ఒంగోలులో గతంలో చేసిన నాలుగు ఇంటి దొంగతనాలను, సింగరాయకొండలో చేసిన దొంగ తనం చేసినట్లు ఒప్పుకున్నాడు.
గత నెల అక్టోబర్ నెలలో 23,24 తేదిలలో భాగ్యనగర్, పుండరీపురం, ఉమామహేశ్వర కాలేజీ ఏరి యాలో జరిగిన ఆరు నేరాలకు సంబంధించి 5 నేరాలలో ఎలాంటి సొత్తు పోయినట్లు, బృందావన నగర్లో జరిగిన 6వ నేరంలో దొంగలించిన యల్సిడి , డివిడి ప్లేయర్ను స్వాధీనం చేసుకున్నామని వారు చెప్పారు.