జగన్ బెయిల్ కోసం లగడపాటి ప్రయత్నాలు: దేవినేని
జగన్ లక్ష కోట్లు దోపిడీ చేస్తే రూ.35 వేల కోట్ల అవినీతి జరిగిందని సిబిఐ కూడా నిర్ధారిస్తే ఈడి ఎందుకు ముందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. సిబిఐ జెడ లక్ష్మీనారాయణ, డిఐజి వెంకటేశ్లకు స్థానచలనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇంకా చాలా చార్జిషీట్లు వేయాల్సి ఉండగా ఉన్నతాధికారులను మార్చడమేమిటన్నారు. జగన్కు బెయిల్ ఇప్పించడం ద్వారా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకునేందుకు గుంభనగా వ్యవహారాలు జరిగిపోతున్నాయని ఆరోపించారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కొడుకును ప్రధానమంత్రిని చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది ఉద్యోగులతో ఆటలాడుకుంటోందన్నారు. సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా సాగుతుంటే సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు ఢిల్లీలో గడ్డి పీకుతున్నారా? కేంద్ర మంత్రులకు సిగ్గు రావడం లేదా అని మండిపడ్డారు.
దివాకర్ ట్రావెల్స్కు సమైక్య సెగ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆగి ఉన్న మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి చెందిన బస్సును గురువారం సమైక్యవాదులు అడ్డుకున్నారు. ప్రయాణికులతో అనంతపురం వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్న బస్సు అద్దాలను స్వల్పంగా ధ్వంసం చేశారు. అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్రకు సంఘీభావం తెలుపుతుంటే రాజకీయ పలుకుబడి గల వ్యక్తులు మాత్రం సొంత బస్సులను రోడ్లెక్కించడం ఏమిటని ప్రశ్నించారు.